TG: రాష్ట్ర హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టు ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నాంపల్లి సీబీఐ కోర్టుకు కూడా ఇలాంటి బెదిరింపు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల వరుసగా వస్తున్న ఈ నకిలీ బాంబు బెదిరింపులు న్యాయవాదులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.