కృష్ణా: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పులిగడ్డ గురుకులం(బాలురు)లో 5, 6వ తరగతుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేపట్టనున్నట్లు ప్రధానాచార్యులు కె. జాన్ వెల్లడించారు. దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు.