NLG: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సాగులో నైపుణ్యాన్ని పెంచుకోవాలని శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నూతన యాంత్రిక పరికరాలను ఉపయోగించి వ్యవసాయాన్ని సరళీకృతం చేసుకోవాలని సూచించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఎలక్ట్రిక్ ట్రాక్టర్, ఇతర వ్యవసాయ పరికరాలను ప్రారంభించారు.