కడప: నగరంలోని ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో తాగునీటి సమస్యపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా ఆర్ఓ ప్లాంట్ చెడిపోవడంతో 350 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరీక్షల సమయంలో నీటి సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమని, అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.