NGKL: జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నర్సరీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పెంచాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.