PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఇటీవల మొలుగూరి కొమురయ్యపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు బుర్ర రాజ కొమురయ్యను ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేష్ తెలిపారు. పాత కక్షలతో తమ్ముడిపై దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన అన్న కొమురయ్య పై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.