JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన “నీటిలో పిల్లల భద్రత మీ బాధ్యత” ఫ్లెక్సీని డీసీపీ రాజమహేంద్ర నాయక్ నిన్న పరిశీలించారు. వేసవిలో పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీసులు పాల్గొన్నారు.