శ్రీకాకుళం: RTC కాంప్లెక్స్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరోసారి నిజాయతీ చాటుకున్నారు. శ్రీకాకుళం నుంచి కొత్తూరుకు వెళ్లేందుకు ప్రయాణికురాలు జ్యోతి కాంప్లెక్స్కు వచ్చింది. ప్రాంగణంలో కూర్చున్న ఆమె రూ.4,800ల నగదు ఉన్న పర్స్ మర్చిపోయింది. బాధితురాలు పర్స్ పోయిందని అధికారులకు ఫిర్యాదు చేసింది. కాంప్లెక్స్లో ADC కు పర్స్ దొరకడంతో అప్పగించారు.