శ్రీకాకుళం: స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో మునిగి డిగ్రీ విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన మందస మండలం బొగాబంద పంచాయతీ కొంటా సాయి గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. సవర మంజు అనే వ్యక్తి స్నానానికి డబార్ సింగ్ రిజర్వాయర్కు వెళ్లాడు. గ్రామస్తులు జలాశయం వైపు వెళ్లి చూడగా శవమై కనిపించాడు. మందస పోలీసులు వివరాలు ఆరాతీస్తున్నారు.