• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శాంతినగర్ పెద్ద మసీద్‌లో ఇఫ్తార్ విందు

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పెద్ద మసీద్ మక్బుల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మౌలానా రజాక్ సర్వ మానవాళి సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఉపవాస దీక్షలను విరమించారు.

February 21, 2026 / 08:47 PM IST

పార్టీ కార్యకర్త పాడె మోసిన మంత్రి

NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ క్యాన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. శనివారం రాష్ట్ర పశుసంవర్థక, క్రీడా, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణ భౌతికకాయానికి పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో మంత్రి పాల్గొని చనిపోయిన కార్యకర్త లక్ష్మీనారాయణ పాడెను మోశారు.

February 21, 2026 / 08:46 PM IST

వైద్య చికిత్స నిమిత్తం ఎల్‌వో‌సిని అందజేసిన ఎమ్మెల్యే

RR: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండకి చెందిన అశోక్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2,50,000 మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నర్నె శ్రీనివాస్ రావుతో కలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అందజేశారు.

February 21, 2026 / 08:42 PM IST

ఇసుక ఫిల్టర్‌లపై దాడులు

MDK: తూప్రాన్ మండలం కిష్టాపూర్ శివారు ఇసుక ఫిల్టర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. హల్దీ వాగు పరిసరాలలో అక్రమంగా ఫిల్టర్లను ఏర్పాటు చేసి తీసుకొని తయారు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ దాడులు చేశారు. దాడుల్లో పైపులైన్లు, విద్యుత్ లైన్‌లను ధ్వంసం చేశారు

February 21, 2026 / 08:38 PM IST

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

MLG: ఆకుల వారి గణపురం, భూపాల్ నగర్ గ్రామాలకు చెందిన పలువురు యువత, వివిధ పార్టీల నేతలు నేడు మంత్రి సీతక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకువెళ్లి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

February 21, 2026 / 08:36 PM IST

ప్రజావాణి కార్యక్రమం యధాతధం: కలెక్టర్

ADB: ప్రతి సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణితో పాటు అన్ని మండల కేంద్రాల్లోని MPDO కార్యాలయాల్లో యధావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. నమోదైన ప్రతి ఫిర్యాదుపై అధికారులు 30 రోజుల్లోగా పరిష్కార నివేదిక సమర్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

February 21, 2026 / 08:33 PM IST

కొత్త సర్పంచులకు ఎంపీడీవో సూచనలు

SRD: సిర్గాపూర్ మండల పరిషత్ ఆఫీస్‌లో నూతన సర్పంచులు, కార్యదర్శులకు శనివారం సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో శారద నూతన సర్పంచులకు విధులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. జీపీ గ్రామసభ, సాధారణ సమావేశం, తీర్మానం, కార్యదర్శిలతో సమన్వయంపై సూచనలు ఇచ్చారు. సంగారెడ్డిలో ఈనెల 23 నుంచి జరిగే ప్రత్యేక శిక్షణ తరగతులకు సర్పంచులు వెళ్లాలని సూచించారు.

February 21, 2026 / 08:33 PM IST

తెలంగాణ ఉద్యమకారుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: తెలంగాణ ఉద్యమకారుడు మణుగూరు మండల పరిధిలోని 220 కెవి సబ్ స్టేషన్  ప్రాంత నివాసి అక్కినపల్లి సైదులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సైదులు ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను చరవాణి ద్వారా అడిగి తెలుసుకున్నారు.

February 21, 2026 / 08:31 PM IST

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదు’

HYD: చంచల్ గూడ కేంద్ర కారగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్, ఉప్పల వెంకటేష్ గుప్తా పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదని, రాజకీయ కక్ష సాధింపుల కోసం కేసులు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. శ్రీకాంత్ పై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

February 21, 2026 / 08:31 PM IST

టీజీవో డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

KNR: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా డైరీ-2026ను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.

February 21, 2026 / 08:30 PM IST

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

MDK: పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలు తీసుకుపోయే సమయంలో జాగ్రత్త వాహించాలని సూచించారు.

February 21, 2026 / 08:30 PM IST

రాష్ట్రస్థాయి కరాటే పోటీలు

JGL: ధర్మపురిలో మార్చి 8 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కుంగ్-పూ&కరాటే పోటీల పోస్టర్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభ వెలికితీయడంలో ఇలాంటి పోటీలు కీలకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

February 21, 2026 / 08:28 PM IST

బాధిత కుటుంబాలను పరామర్శించిన BJP నేతలు

BHPL: రేగొండ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులను శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల కుటుంబానికి BJP అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 08:26 PM IST

వికారాబాద్‌కు చేరుకున్న వైఎస్ షర్మిల

VKB: వికారాబాద్‌లో వైసీసీ అధ్యక్షుడు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

February 21, 2026 / 08:26 PM IST

వివాహ వేడుకల్లో దారుణ హత్య

PDPL: రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)ను గేటు ముందే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 08:24 PM IST