• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మట్టపల్లిలో విశేష పూజలు

SRPT: మట్టపల్లి క్షేత్రంలో శనివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సుప్రభాత సేవ, నిత్యహోమం మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీ లక్ష్మీనరసింహస్వా మి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. అనంతరం రుత్విగ్వరణం, మధుఫర్క పూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు.

February 22, 2026 / 05:13 AM IST

ఈ నెల 25న పట్టుబడిన ఇసుకకు బహిరంగ వేలం

ASF: జైనూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకకు ఈ నెల 25న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు MRO ఆడ బిర్షవ్ ప్రకటనలో తెలిపారు. గత నవంబర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఈ ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు, ఇతరులు ఈ వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. వివరాల కోసం MRO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

February 22, 2026 / 05:09 AM IST

బిక్కనూర్‌లో యాక్సిడెంట్.. పలువురికి గాయాలు

కామారెడ్డి: బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి బిక్కనూర్‌కు వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాలు.. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 05:01 AM IST

రేపటి నుంచి ఎల్ఎల్‌బీ పరీక్షలు

NZB: TU పరిధిలో ఎల్ఎల్‌బీ ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి మార్చ్ 4 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు మిగతా వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించలని సూచించారు.

February 22, 2026 / 04:59 AM IST

రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

ఆదిలాబాద్‌: కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. డిజిటల్ ఫిర్యాదులకు సమాధానం ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

February 22, 2026 / 04:51 AM IST

నేడు విద్యుత్ సరఫాలో అంతరాయం

SRPT: పెన్పహాడ్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండల కేంద్రంతో పాటు దుబ్బతండా, పొట్లపహాడ్ గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్‌కు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 22, 2026 / 04:29 AM IST

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

SRPT: తిరుమలగిరి మండలంలోని వెలిశాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లాక్యతండాకు చెందిన నెహ్రూ (30) బైక్‌పై వెళ్తుండగా, వెలిశాల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెహ్రూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 04:25 AM IST

టెన్నిస్‌లో అదనపు ఎస్పీకి స్వర్ణం

NRPT: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నారాయణపేట అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్ హూల్ హక్ విశిష్ట ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 50 ఏళ్లపై సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కుని ప్రథమస్థానంలో నిలిచారు.

February 22, 2026 / 04:14 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన MLC

MHBD: గంగారం మండలం రెడ్యాల గ్రామానికి చెందిన మాజీ TPCC కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్ కాంత్ రెడ్డి తండ్రి రాఘవేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

February 21, 2026 / 09:43 PM IST

చర్లపల్లి పాఠశాలలో మాతృభాషా దినోత్సవం

HNK: నడికూడ (M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, తెలుగు భాషా ఉపాధ్యాయులు పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలను అన్నింటిని రక్షించుకోవాలన్నారు. మాతృభాష మృత భాష కాకూడదని అమృత భాష కావాలని కోరారు. ఉపాధ్యాయులు లకావత్ దేవ, రాజకుమార్ ఉన్నారు.

February 21, 2026 / 09:38 PM IST

RTC డిపో మేనేజర్‌కు వినతి

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మహేశ్వరంలో ప్రతి బస్స్ హాల్టింగ్ చేయాలని శనివారం కౌన్సిలర్ మృత్ నాయక్, శిరీష రాజు RTC డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రజలు బస్సు ఆపకపోవడంతో నర్సంపేటకు రావాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు స్పందించి బస్సు హాల్టింగ్ చేయాలని కోరారు.

February 21, 2026 / 09:34 PM IST

‘బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలి’

ADB: బజార్హత్నూర్ మండలానికి చెందిన బుకి సుమిత్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ సుమిత్ ను శనివారం పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.5 లక్షల ఎల్‌వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

February 21, 2026 / 09:11 PM IST

కల్వ చర్లలో నేత్రదానం

PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల రాధమ్మ మృతి అనంతరం కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ సహకారంతో ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్ నేత్రాలను సేకరించారు. కుమారులు శ్రీనివాస్, గణపతి, రాంశంకర్, కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.

February 21, 2026 / 09:05 PM IST

రేపు CM పర్యటన.. ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

ములుగు జిల్లా కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టును ఆదివారం CM రేవంత్ రెడ్డి పరిశీలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దేవాదుల పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మహేందర్ జీ, RDO వెంకటేష్ పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను BHPL SP సంకీర్త్ గౌడ్, ఏటూరునాగారం ASP మనన్ భట్ పరవేక్షిస్తున్నారు.

February 21, 2026 / 09:05 PM IST

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే

SRD: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతతో పాటు జీవితానికి దిశానిర్దేశం ఇస్తాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం నాగలిగిద్ద మండలం ఔదత్ పూర్‌లోని శ్రీ ఎల్లా లింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఇక్కడ జాతర మహోత్సవాల్లో మచ్చేందర్ నాథ్ మహారాజ్‌ను కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.

February 21, 2026 / 08:55 PM IST