• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎన్నికల పోటీ చేసేందుకు యువత ఆసక్తి

MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని మండలాల్లో యువత స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ సిద్ధమైన విషయం తెలిసింది. దీంతో చాలా గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. తమ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయన్నారు.

September 1, 2025 / 09:23 AM IST

ఆర్టీసీ సిబ్బంది నిజాయతీ

KMM: బస్సులో ప్రయాణికురాలు మర్చిపోయి వెళ్లిన డాక్యుమెంట్‌లను తిరిగి ఆమెకు అప్పగించి RTC సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. ఖాజీపురానికి చెందిన షేఖ్ షకీలా ఆదివారం తిరువూరు నుంచి మధిరకు వస్తున్న బస్సులో ఎక్కింది. ఖాజీపురంలో దిగే సమయంలో తన డాక్యుమెంట్స్ సీటులో మర్చిపోయి వెళ్లింది. గమనించిన కండక్టర్ సరోజిని పైఅధికారుల సమక్షంలో ఆమెకు అప్పగించారు.

September 1, 2025 / 09:20 AM IST

వైద్య శాఖలో సెలక్షన్ జాబితా విడుదల

SRD: వైద్యశాఖలో 10 విభాగాలు 117 పోస్టులకు సెలక్షన్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల సోమవారం ప్రకటనలో తెలిపారు. జాబితాను వెబ్ సైట్‌లో మించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి త్వరలో నియామక పత్రాలు అందజేసి పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పారు. పోస్టింగ్ అనుకున్న తర్వాత వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.

September 1, 2025 / 09:17 AM IST

విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి

NLG: పెద్దవూర మండలం పులిచెర్లలో విద్యుత్ షాక్‌తో ఆదివారం పాడిగేదె మృతి చెందింది. పొలంలో మేపుతుండగా స్టార్టర్‌కు వెళ్లే విద్యుత్ తీగ తగలడంతో గేదె చనిపోయిందని యజమాని మాడుగుల లక్ష్మమ్మ తెలిపారు. గేదె మృతితో ఆర్థికంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె వేడుకున్నారు.

September 1, 2025 / 09:14 AM IST

అన్నపూర్ణేశ్వరుడిగా సిద్ధి వినాయకుడి దర్శనం

SRD: పటాన్‌చెరు మండలం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక ఆలయం బ్రహ్మోత్సవాల్లో సోమవారం అన్నపూర్ణేశ్వరుడిగా సిద్ది గణపయ్య దివ్య దర్శనమిచ్చారు. ఆలయ వార్షిక, బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈరోజు 6వ స్వామికి అన్నంతో అలంకరించి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఎండోమెంట్ కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో నిర్దిత ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా చేపడుతున్నారు.

September 1, 2025 / 09:13 AM IST

దేవాలయానికి వెళ్లే దారి అధ్వానం

MNCL: జన్నారం మండలం కవ్వాల్‌లోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వెళ్లే దారి గుంతలమయంగా మారింది. వర్షం కురిస్తే గుంతలలో నీరు చేరి, దేవాలయానికి వెళ్లడానికి భక్తులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో బైకులు, కార్లు, కాలినడకన వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేయాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.

September 1, 2025 / 09:12 AM IST

ఆచార్య ప్రభుదయాల్‌కి ఘన సన్మానం చేసిన శిష్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడికి దక్కని అపూర్వ గౌరవం గురువు ప్రభుదయాల్‌కి దక్కింది. ఆయన నేర్పిన చదువు పాటవాలతో ప్రయోజకులైన వారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఏజెన్సీ BEd కాలేజ్ భద్రాచలం శిష్యులందరూ కలిసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన ప్రసంగాల మధ్య ఘనసన్మానం చేశారు.

September 1, 2025 / 09:11 AM IST

‘ఇద్దరు రిపోర్టర్లపై కేసు నమోదు’

KMM: తిరుమలాయపాలెం మండలంలో వేర్వేరు పత్రికల్లో రిపోర్టర్లుగా పనిచేస్తున్న బోడపట్ల సతీష్, పోలెపొంగు నాగరాజుపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్ వద్ద ఇద్దరూ ఘర్షణ పడ్డారని, ఈ క్రమంలో ఇరువురూ పరస్పరం ఫిర్యాదు చేయగా ఇద్దరిపైనా కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

September 1, 2025 / 09:09 AM IST

‘ఎరుకలకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’

KNR: కిసాన్ నగర్‌లో క్రిమినల్ ట్రైబ్ చట్టం రద్దు దినోత్సవం సందర్భంగా ఎరుకల ప్రజలు తమ స్వీయ గౌరవ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానుపాటి రవి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకలవ్య కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

September 1, 2025 / 09:08 AM IST

BHPL ఆర్టీసీలో ప్రత్యేక టూర్ ప్యాకేజ్

BHPL: భూపాలపల్లి డిపో నుంచి సెప్టెంబర్‌లో టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని మేనేజర్ ఇందు సోమవారం తెలిపారు. సెప్టెంబర్ 2న భద్రాచలం ఒక రోజు టూర్ రూ.1000, 9న విజయవాడ-రాజమండ్రి-అన్నవరం మూడు రోజులు రూ.2,300, 16న కాణిపాకం-తిరుపతి-శ్రీకాళహస్తి ఐదు రోజులు రూ.5,300, 23న వైజాగ్ సిటీ టూర్ మూడు రోజుల ప్యాకేజీలు ఉన్నాయని పేర్కొన్నారు.

September 1, 2025 / 09:08 AM IST

జిల్లా వ్యాప్తంగా 89.6 మి.మీ వర్షపాతం

జనగాం: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 89.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని తరిగొప్పుల 2.0, చిల్పూర్ 3.2, జఫర్గడ్ 24.6, స్టేషన్ ఘనపూర్ 4.0, రఘునాథపల్లి 2.4, నర్మెట్ట 11.2, బచ్చన్నపేట 1.0, జనగామ 6.2, లింగాల ఘనపూర్ 2.2, దేవరుప్పుల 10.8, పాలకుర్తి 11.6, కొడకండ్ల 10.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.

September 1, 2025 / 09:02 AM IST

నల్లవాగు ప్రాజెక్ట్ కు 1192 క్యూసెక్కులు వరద

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు డ్యాంలో 1192 క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి సోమవారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా 46 క్యూసెక్కులు, అలుగు ద్వారా 1100 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 1146 క్యూసెక్కులు కొనసాగుతున్నదన్నారు. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లేవల్ 1493 అడుగులు కాగా, 1493.42 ఫీట్ల వద్ద జలాలు నిల్వ ఉన్నాయి.

September 1, 2025 / 09:00 AM IST

గోదావరి తీర ప్రాంతంలో పంటలకు నష్టం

MNCL: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గోదావరి నదిలోకి భారీగా వరద రావడంతో జైపూర్ మండలంలో 1, 380 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 624 మంది రైతులకు సంబంధించి 820 ఎకరాల్లో వరి, 525 ఎకరాల్లో పత్తి, 35 ఎకరాల్లో మిరప పంటలకు నష్టం కలిగిందని అధికారులు నివేదిక తయారు చేశారు. గోదావరి తీర ప్రాంతంలో ప్రతి ఏడాది పంటలు మునిగి రైతులకు నష్టం మిగులుతోంది.

September 1, 2025 / 08:59 AM IST

భైంసాలో ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

NRML: పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి, రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గోపీనాధ్ తెలిపారు. భైంసాలోని ఖాన్ ఆటో నగర్ ఏరియాలో నయరా పెట్రోల్ బంక్ వెనుకలో పేకాట ఆడుతున్నారన్నా పక్కా సమాచారం మేరకు దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

September 1, 2025 / 08:58 AM IST

జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు

మెదక్: పట్టణంలో అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో 46.3 మి.మీ., సర్ధనలో 43.3 మి.మీ., మెదక్ మండలం రాజుపల్లిలో 36.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చేగుంటలో 16 మి.మీ.లకుపైగా వర్షం పడింది.ఈ వర్షం వల్ల మెదక్, హవేలీ ఘనపూర్, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

September 1, 2025 / 08:56 AM IST