NZB: విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని భారతీయ విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు కస్ప లింగం కోరారు. ఉపాధ్యాయుల డిమాండ్లను నెరవేర్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోకి మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. ఆకాశ్, అక్షయ్, గణేశ్, ఉదయ్, కిరణ్, వికాస్, భూమేష్ పాల్గొన్నారు.
ఖమ్మం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కేంద్ర మంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలు సరికావని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భట్టి, మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
HYD: అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఫేస్-1, 2 ప్రాంతాల్లో రోడ్డు పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 42 లక్షలతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మతులు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
HYD: ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బీజేపీ సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఈ మేరకు సీతాఫల్ మండి చిలకలగూడలోని గాంధీ బొమ్మ దగ్గర బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ హాజరయ్యారు. మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు.
HYD: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని గౌలిపుర డివిజన్ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఇటీవల డ్రైనేజీ ఓవర్ ఫ్లోపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
HYD: కంటోన్మెంట్ 8వ వార్డు రీసాల బజార్, శాంతినగర్ కాలనీలో మంగళవారం రోడ్డు పనులను కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్లో జరిగే ప్రతీ అభివృద్ధి పని వెనక బీజేపీ నాయకులు, కార్యకర్తల కష్టం ఉందన్నారు. వారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆదిలాబాద్: ఖానాపూర్ కోర్టు ఏజీపీగా నియమితులైన ఆసీఫ్ అలీని అంబేద్కర్ సంఘం ఖానాపూర్ నాయకులు సన్మానించారు. మంగళవారం వారు ఖానాపూర్ పట్టణంలో ఏజీపీ ఆసీఫ్ అలీని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేస సతీష్, సీనియర్ నాయకులు రేవతి రాజేశ్వర్ నేత, శ్యామ్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, రసమల శేఖర్, ప్రణీత్, రాజేశ్వర్, ఎం.సురేష్, దామోదర్ ఉన్నారు.
KNR: హుస్నాబాద్ బస్ స్టేషన్ పరిసరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్ పునరాభివృద్ది మరమత్తులు పనులు ఎక్కడి వరకు వచ్చాయని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. పనులు ఆలస్యంపై అధికారులతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్ స్టాండ్లో బ్యూటిఫికేషన్ లోపలికి బయటకు వచ్చే మార్గాల అభివృద్దిపై చర్చించారు.
మహబూబ్ నగర్: నవాబుపేట మండలం మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్ కుటుంబాన్ని జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి మంగళవారం పరామర్శించారు. ఖాజా మైనుద్దీన్ ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీకి ఖాజా మైనుద్దీన్ ఎనలేని సేవలు అందించారని వెల్లడించారు.
మహబూబ్ నగర్: జిల్లా అభివృద్ధికి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ స్వర్గీయ మల్లికార్జున్ ఎంతో కృషి చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. మల్లికార్జున్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పద్మావతి కాలనీలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
SRCL: జిల్లాలో 2024 సంవత్సరంలో 3106 కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం 2024 వార్షిక నివేదికను ఎస్పీ విడుదల చేశారు. ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులస్నేహపూర్వక విధానం, పోలీసుల పారదర్శక పనితీరు విధానం బాగుందన్నారు.
SRPT: తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్ కడెం లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ శాగంటి అనసూయకు బస్ డిపో నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బస్ డిపో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బస్ డిపో నిర్మాణం చేయాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.
JN: జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ప్రభుత్వం ఐపీఎస్ అధికారిని నియమించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా చాటిన మనన్ భట్ ట్రైనీ అధికారిగా జనగామలో అడుగు పెట్టారు. ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఆయన కొన్ని రోజులు సేవలందించనున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఛార్జి తీసుకున్నారు.
WGL: ఎనుమాముల ఇందిరమ్మ ఫేస్ కాలనీ-1లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు స్థానిక నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
JN: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను జనగామ కాంగ్రెస్ నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని పలు సమస్యలను వారికి వివరించాడు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరారు.