గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్ నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్తో పొత్తు లేకుండా 14 మంది అభ్యర్థులతో సీపీఎం తొలి జాబితా విడుదల చేసింది
రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో ఎల్లప్పుడూ బిజీబిజీగా గడిపే మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో కేటీఆర్ సందడి చేశారు.
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
రాష్ట్రంలో కాళేశ్వరంలో ప్రాజెక్టు(kaleshwaram project)లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పగుళ్ల అంశంపై దీనిని నిర్మించిన L&T సంస్థ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన డిజైన, నాణ్యత మేరకు నిర్మించామని..అవసరమైతే దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళ్తారని, వారి నంబర్ తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అయితే కవిత, కేసీఆర్ పేర్లను ప్రస్తావిస్తు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అన్యాయం కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదు, సీబీఐ విచారణ ఎందుకు అదేశించడం లేదని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వందలకోట్ల అవినితీ చేశాడని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఆర్థిక ఉగ్రవాదులని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మైనంపల్లి హన్మంతరావు, రేవంత్ రెడ్డిలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ఓ రౌడీ అని.. రేవంత్ తన నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
తెలంగాణలో ఎన్నికలు ఉన్న క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆంధ్రా అభివృద్ధి గురించి మాట్లాడటం సరికాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) స్పష్టం చేశారు. అంతేకాదు మీరు మీ ప్రాంతంలో చేసిన పనులు గురించి చెప్పుకోవాలని హితవు పలికారు.
స్టేషన్ ఘనపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ తెగ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. కొన్నిరోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. తాజాగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
కామారెడ్డిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తనకు కేటాయించిన గ్రామంలో ఎందుకు ప్రచారం చేస్తున్నావని అడిగితే.. జెడ్పీటీసీపై ఎంపీపీ పిడి గుద్దులు గుప్పించాడు.
తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితోపాటు బార్లు కూడా తెరుచుకోవు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరుసగా మూడు రోజులు మద్యం అమ్మకాలు బంద్ పెట్టనున్నారు.
సెంటిమెంట్ దేవుడు కోనాయిపల్లిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ వస్తున్నారు. అక్కడ స్వామి వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు.
తన భద్రత విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు.