SRPT: తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గడ్డం చిన్నవెంకన్న గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాలిలా.. తాటిచెట్టు ఎక్కుతుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. గాయ పడిన చిన్న వెంకన్నను స్థానిక ఆసుపత్రికి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు.
కామారెడ్డి: పిట్లం మండల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నేడు రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అయ్యప్ప ఆలయ ఆవరణలో ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్త దాతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
KMR: న్యాయవాది పరిషత్ కోశాధికారిగా కే. గంగరాజు ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల్లో రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన న్యాయవాది గంగరాజును ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అప్పగించినా పదవికి తగిన న్యాయం చేస్తానన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామి ఇచ్చారు.
KNR: నగర స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నగరంలో పర్యటించారు. అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను, నగరపాలకసంస్థ ఓల్డ్ ఫిల్టర్ బెడ్ స్థలంలో కొత్తగా నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని సందర్శించి పరిశీలించారు.
HYD: తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతిలు మహిళా టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కావడంపై సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. మలేషియా కౌలాలంపూర్ వేదికగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్ 19 – మహిళా టీ20 ప్రపంచ క్రికెట్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో వీరిద్దరికీ చోటు దక్కింది. ఈ మేరకు సీఎం ఇరువురిని X ద్వారా అభినందించారు.
WGL: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ సత్య శారదా దేవి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామూనూరు విమానాశ్రయం ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పనుల పురోగతిపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, పలు శాఖల అధికారులు ఉన్నారు.
NRML: సేంద్రియ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ పదార్థాల చిరు ఆహార కేంద్రాన్ని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహమ్మద్తో కలిసి ఆమె ప్రారంభించారు.
NRML: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాన్ మండలం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సరస్వతి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తారు. అనంతరం లక్ష్మణచందా మండలం వడ్యాల్ గ్రామం నుంచి రత్నపూర్ కాండ్లి గ్రామం వరకు నూతన బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
NZB: జిల్లాలోనీ నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలోని శబరి మాత ఆశ్రమం వద్ద ఆంజనేయ భక్తుల సహకారంతో బుధవారం ఉదయం 9.25 గంటలకు అభయాంజనేయ విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
NRML: ఈనెల 27న హైదరాబాదులో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ అభిలాష శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా నుంచి 550 మంది రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనబోతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారని అభినందించారు.
NLG: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ.. క్రైస్తవులకు పరమ పవిత్రమైనదన్నారు. క్రీస్తుబోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరుకున్నారు.
MNCL: బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీయన్షి రన్నర్గా నిలిచినట్లు మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టీం మేనేజర్ పుల్లూరి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఫైనల్ మ్యాచ్లో హర్యానా క్రీడాకారిణి దేవిక సిహాగ్తో హోరాహోరీగా తలపడి రన్నర్గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ASF: కుల గణన సర్వే చేసిన ఉపాధ్యాయులకు సీసీఎల్ సెలవులు ఇవ్వాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు లకావత్ శంకర్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కుల గణన సర్వే విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు (5) రోజుల సెలవు దినాలను నష్టపోయారని తెలిపారు. కావున వారికీ సీసీఎల్ సెలవులు ఇవ్వాలని డీఈవోకు వినతి పత్రం సమర్పించారు.
NZB: జిల్లా ప్రజలకు క్రీస్తు జన్మదినం సందర్భంగా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు. అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆమె ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లి విరియాలని కోరారు. ఎల్లప్పుడు ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదరా భావముతో మెలగలన్నారు.
PDPL: రామగుండం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న 350 పడకల ఆసుపత్రి పనులు వచ్చే 10నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం రామగుండంలో నూతనంగా నిర్మాణమవుతున్న ఆసుపత్రి పనులను, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని, రామగుండం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట రామగుండం వైద్యకళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.