• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తప్పిపోయిన వ్యక్తి.. నీటిలో శవమై తేలాడు

NGKL: తప్పిపోయిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన ఘటన కల్వకుర్తిలో జరిగింది. ఎస్సై మాధవ రెడ్డి తెలిపిన వివరాలు.. చారగొండ మండలంలోని తుర్కలపల్లికి చెందిన పర్వతం పుల్లయ్య గత నెల 20న తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నారు. పుల్లయ్య మృతదేహాన్ని కల్వకుర్తి పట్టణ సమీపంలోని ఓ నీటి కుంటలో మంగళవారం సాయంత్రం కనుకున్నట్లు ఆయన తెలిపారు.

December 25, 2024 / 06:01 AM IST

రేపు MRPS నేతల సమావేశం

HYD: సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కళా మండలి అధ్యక్షుడు అశోక్ మాదిగ రామచంద్ర మాదిగ డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర సమావేశం అల్వాల్ లోతుకుంటలో నిర్వహిస్తామని మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

December 25, 2024 / 05:58 AM IST

నేడు కోయిల్ సాగర్ నుంచి నీటి విడుదల చేయనున్న ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ కుడి, ఎడమ కాల్వలకు బుధవారం సాగు నీటిని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విడుదల చేయనున్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారని ప్రాజెక్టు అధికారి ప్రతాప్ సింగ్ తెలిపారు.

December 25, 2024 / 05:39 AM IST

పథకాలు సాధించిన ప్రణీతను సత్కరించిన ఎమ్మెల్యే

KMM: పరుగు పందెంలో మూడు పథకాలు సాధించిన సత్తుపల్లికి చెందిన కొమ్ము ప్రణీతను ఎమ్మెల్యే రాగమయి సత్కరించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ గురు గోవింద్ స్టేడియంలో జరిగిన 76వ జాతీయ స్కూల్ గేమ్స్ 600మీ, 400మీ.ల పరుగు పందెంలో పాల్గొని రెండు వెండి పథకాలను, 200 మీ.ల పరుగు పందెంలో విజయం సాధించి కాంస్య పథకాన్ని సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు అభినందించారు.

December 25, 2024 / 05:25 AM IST

అమ్మాపూర్ గ్రామానికి చెందిన బాలుడు అదృశ్యం!

MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎర్రమందెల దశరథ్ కుమారుడు అఖిల్(6) అదృశ్యమయ్యాడు. అమ్మాపూర్ గ్రామంలో నిన్న మధ్యాహ్నం తన ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

December 25, 2024 / 05:22 AM IST

నేడు క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న ఎమ్మెల్యే

KMM: కామేపల్లి మండలం ముచ్చర్ల లక్ష్మీ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి తెలిపారు. వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తెలంగాణ అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

December 25, 2024 / 05:18 AM IST

వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే హెచ్చరిక

KMM: ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు ఎప్పుడు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు.

December 25, 2024 / 05:13 AM IST

ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. పలువురికి తీవ్ర గాయాలు

KMM: వైరా మండలంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వంశీ కృష్ణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 25, 2024 / 05:09 AM IST

నేడు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్న ఎమ్మెల్యే

BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు క్రిస్మస్ సందర్భంగా బుధవారం పలు చర్చిల్లో జరిగే క్రిస్మస్ వేడుకలో పాల్గొంటారు. కొత్తగూడెం, పాల్వంచ, రామవరం, రుద్రంపూర్ ప్రాంతాల్లోని సీఎస్ఐ చర్చిల్లో జరిగే క్రిస్మస్ వేడుకలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మార్వో ఆఫీస్ బేతస్థ ప్రేయర్ హాల్‌కు హాజరవుతారని చెప్పారు.

December 25, 2024 / 05:03 AM IST

ఈ ఏడాది సైబర్ నేరాలు పెరిగాయి: సీపీ అవినాష్ మహంతి

HYD: సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. సాంప్రదాయ కేసులు తగ్గి సైబర్ నేరాలు, ఆర్థిక కేసులు పెరిగాయని తెలిపారు. ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ కేంద్రంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వివరించారు.

December 25, 2024 / 04:55 AM IST

నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి

NLG: బుధవారం ఉదయం 10 గంటలకు NLG శ్రీనగర్ కాలనీ క్యాంపు ఆఫీసులో వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమావేశం 11.30 గంటలకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మాతా శిశుసంరక్షణ కేంద్రానికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మెడికల్ ఎక్విప్ మెంట్లడొనేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు క్లాక్ టవర్ సమీపంలోని చర్చ్‌లో హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు RMPల సమావేశంలో పాల్గొంటారు.

December 25, 2024 / 04:46 AM IST

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

KNR: హుజురాబాద్ ఎంజేపీ బాలికల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని గోలిపల్లి అంజలి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో, ఈనెల 28 నుంచి 30 వరకు జరగనున్న జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు, ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపల్ రాగమణి తెలిపారు. దీంతో అంజలి స్వగ్రామమైన మహ్మదాపూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెను అభినందించారు.

December 25, 2024 / 04:44 AM IST

28న సన్నాహక సమావేశం

NZB: సాలూర మండలం హున్స, మందర్నా, ఖాజాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. ఈ నెల 28న ఎడపల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ పునఃప్రారంభ సన్నాహాక సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హజరైన అభిప్రాయాలను తెలియజేయాలన్నారు.

December 25, 2024 / 04:44 AM IST

మంగపేట మండలంలో మంత్రి సీతక్క పర్యటన

MLG: జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం రహదారుల నిర్మాణాలకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్‌ను ప్రారంభించి మొక్కను నాటారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీసీఎఫ్ ప్రభాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

December 25, 2024 / 04:43 AM IST

నేడు జిల్లాలో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం పర్యటన

MDK: జిల్లాలో నేడు పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రీయ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు సీఎం రేవంత్ కూడా బుధవారం ఏడు పాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

December 25, 2024 / 04:39 AM IST