KNR: హుజురాబాద్ ఎంజేపీ బాలికల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని గోలిపల్లి అంజలి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో, ఈనెల 28 నుంచి 30 వరకు జరగనున్న జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు, ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపల్ రాగమణి తెలిపారు. దీంతో అంజలి స్వగ్రామమైన మహ్మదాపూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెను అభినందించారు.
NZB: సాలూర మండలం హున్స, మందర్నా, ఖాజాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. ఈ నెల 28న ఎడపల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ పునఃప్రారంభ సన్నాహాక సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హజరైన అభిప్రాయాలను తెలియజేయాలన్నారు.
MLG: జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం రహదారుల నిర్మాణాలకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ను ప్రారంభించి మొక్కను నాటారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీసీఎఫ్ ప్రభాకర్రావు, తదితరులు పాల్గొన్నారు.
MDK: జిల్లాలో నేడు పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రీయ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు సీఎం రేవంత్ కూడా బుధవారం ఏడు పాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
BHNG: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మంగళవారం క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ.. క్రైస్తవులకు పరమ పవిత్రమైందన్నారు. క్రీస్తుబోధనలు ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరుకున్నారు.
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం తిరుమల హిల్స్కు చెందిన దివ్యాంగురాలు జాడి అఖిలకు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ రూ.1లక్ష నగదు వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.
ASF: క్రిస్మస్ సెలవులు, జిన్నింగ్ మిల్లులో అధిక నిల్వల కారణంగా అయిదు రోజులు పత్తి కొనుగోలను నిలిపివేయనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసిఫాబాద్, వాంకిడి, కొండపల్లి (రెబ్బెన), సిర్పూర్, కౌటాల జిన్నింగ్ మిల్లులలో ఈనెల 25 నుంచి 29వ వరకు ఐదు రోజులు పత్తి కొనుగోలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
KNR: జిల్లాలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 27న దివ్యాంగుల కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నామని, జిల్లా సంక్షేమ అధికారి కె. సబితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని, 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.
NZB: తెలంగాణ ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు తేదీని ఈ నెల 30 వరకు పొడిగించినట్లు భీమ్గల్ ఎంఈఓ, ఓపెన్ స్కూల్కో ఆర్డినేటర్ స్వామి తెలిపారు. 10వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు 14, 15 సంవత్సరాలు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు స్థానిక జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో సంప్రదించాలని కోరారు.
కామారెడ్డి: నాగిరెడ్డిపేట్లో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్రావు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందిస్తూ రూ.55 లక్షల అంచనా వ్యయంతో టెండర్కు పిలిచింది. దీంతో నాగిరెడ్డిపేట్ బస్టాండ్ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు.
NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం నల్గొండకు రానున్నారు. ఉదయం 8 గంటలకు HYD నుంచి మంత్రి బయల్దేరి 10 గంటలకు NLGలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఉదయం 11.30గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి కార్యక్రమంలో, మధ్నాహ్నం 12.30 గంటలకు క్రిస్మస్ వేడుకలకు హజరవుతారు. సాయంత్రం 4 గంటలకు ఆర్ఎంపీల సమావేశంలో పాల్గొంటారు.
MLG: మినీ మేడారం జాతర నేపథ్యంలో పూజారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మేడారం జాతర విజయవంతంలో పూజారులు, ప్రజలు భాగస్వామ్యులు కావాలన్నారు. మేడారం జాతరకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే మహా జాతరను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
JGL: మెట్పల్లి పట్టణంలోని శ్రీ వాణి నికేతన్ హై స్కూల్లో, 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 37 ఏళ్ల తర్వాత, బాల్య మిత్రులందరు, కలుసుకొని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరికి ఒకరు మంచి చెడులను, తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. అపూర్వ సమ్మేళనం ఆవిష్కృతమైందన్నారు.
SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ క్రైమ్ వార్షిక నివేదికపై పత్రిక సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గత సంవత్సరంతో పోల్చుకుంటే హత్య కేసులు పెరగలేదని, దొంగతనం, గంజాయి కేసులు కొద్దిగా పెరిగాయని తెలిపారు. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఎఆర్ సిస్టంను పాటిస్తూ స్టేషన్కు ఫిర్యాదులు రాగానే వెంటనే స్పందించి కేసులు నమోదు చేశామన్నారు.