NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ ప్రధానకాలువ ద్వారా ఇవాళ ఉ.10గం.కు నీటిని విడుదల చేయనున్నట్లు పోచంపాడు ఇరిగేషన్ సర్కిల్ SE శ్రీనివాస్ రావు తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్-1(D5 నుంచి D53)ఆయకట్టుకు 7రోజులు, జోన్-2(D54 నుంచి D94)ఆయకట్టుకు 8రోజులు సాగునీటి సరఫరా చేస్తామన్నారు. మొదట జోన్ 2కు ఏప్రిల్ 8వరకు సాగునీటి విడుదల ఉంటుందని వివరించారు.
WGL: వరంగల్ సీపీ అంబ కిషోర్ ఝా వార్షిక తనిఖీల్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రత దృష్ట్యా రాత్రి వేళలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం మొక్కను నాటారు.
ADB: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బూత్ కమిటీల ఎంపిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకం, ప్రస్తుత తాజా రాజకీయాలు, ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు నగేష్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు తదితరులున్నారు.
BHPL: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఏసుక్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైనదన్నారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. మంచి మనసుతో సేవ చేయడం ఎలాగో క్రీస్తు బోధనలు తెలిపాయని పేర్కొన్నారు.
WGL: జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కాకతీయ మేఘ టెక్స్టైల్ పార్క్, విమానాశ్రయం ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ హై వే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట: జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్లో వినియోగదారుల అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ తనుజ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈనెల 15న సేవా రత్న జాతీయ అవార్డు కుంభాల రవి, జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత గుర్రాల శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు.
HNK: జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య క్రిస్మస్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు ఉద్యోగులకు, అధికారులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరుపేరునా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
KNR: భగత్ నగర్ మంచి నీటి రిజర్వాయర్ పైపులైన్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసి డివిజన్లకు యథావిధిగా తాగు నీరు సరఫరా చేస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం రిజర్వాయర్కు తాగు నీరు సరఫరా అయ్యే హెచ్డీపీఏ పైపులైన్ పగిలిపోవడంతో, మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. వేగవంతంగా పనులు చేపట్టి నీరదిస్తామని హామీ ఇచ్చారు.
NLG: జిల్లాలో ప్రజలకు ట్రాఫిక్ నియంత్రణ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణ కొరకు నూతనంగా వచ్చిన 22 మధ్యలో 5 మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించామన్నారు.
JGL: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి విధిగా అందరికీ హెల్త్ చెకప్ చేయాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయన వెంట మండల వైద్యాధికారిని డాక్టర్ రాధ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కుద్దుస్స్ పాల్గొన్నారు.
HYD: వినాయకనగర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు పూర్తవుతున్న తరుణంలో పనులను GHMC ఇంజినీరింగ్ విభాగం DE నిఖిల్ రెడ్డితో కలిసి బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పర్యవేక్షించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో AE సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
JGL: వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్త రాజమణి ఇంట్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణ రెడ్డి, రామచంద్రం గౌడ్, జూపాక కుమార్, తదితరులున్నారు.
నిర్మల్: జిల్లా కుబీర్ మండలంలోని పల్సీ, కుబీర్, చొండీ, జుండా, పార్డీ బీ, భైంసా మండలంలోని మాహాగం గ్రామంలో ఇటీవలే మృతి చెందిన పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధులగా అండగా ఉంటామన్నారు.
గద్వాల: సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం గద్వాలలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరం వద్దకు చేరుకొని మద్దతు ప్రకటించారు. విద్యారంగ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను విస్మరించడం ప్రభుత్వానికి తగదన్నారు.
NZB: అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని రైల్వే కమాన్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట అమిత్షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్, గ్రంథాలయ ఛైర్మన్ పాల్గొన్నారు.