SRD: సంగారెడ్డి పట్టణంలోని చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రైస్తవ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సీడీసీ ఛైర్మన్ రామ్ రెడ్డి, రుబెన్ రెడ్డి పాల్గొన్నారు.
NRML: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ని అవమానపరిచిన అమిత్ షాను కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతిని అడ్రస్ చేస్తూ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలిసి వినతి పత్రం అందజేశారు.
NLG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు సమస్యల గురించి కౌన్సిలర్ కామిశెట్టి శైలజ గారు మున్సిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజును కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా వార్డులో మంచినీటి సమస్య, హనుమాన్ నగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సంబంధించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరడం జరిగింది, దీనికి మున్సిపల్ ఛైర్మన్ కౌన్సిలర్ తెలిపారు.
BDK: మణుగూరు మండలం సాంబాయిగూడెంలో BRS పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు పార్టీల నుండి 20 కుటుంబాల వారు BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
NZB: బాన్సువాడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించే మహా మండల పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి వ్యవస్థాపక గురు స్వామి, ZPTC మాజీ సభ్యుడు కొత్తకొండ భాస్కర్ కోరారు. మంగళవారం మండల పూజా మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
SRPT: ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ప్రజలంతా శాంతి సామరస్యాలతో ఎదుటివారిపై జాలి, కరుణ చూపాలని ఏసుక్రీస్తు చాటి చెప్పాడని రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి శ్రీవిద్యా కరుణాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకలో పాల్గొని మాట్లాడారు.
MDK: ఝరాసంగంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి మంగళవారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రుద్రాభిషేకం, గుండం పూజ, కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి పూలమాల శాలువాతో సన్మానించారు.
BDK: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అన్ని రకాల ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. నేషనల్ హెల్త్ ప్రోగ్రాం ఇండికేటర్లలో 100% అచీవ్మెంట్ సాధించాలని ఆదేశించారు. సికెల్ సెల్ స్క్రీనింగ్, కార్డ్స్ త్వరగా డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయాలని చెప్పారు.
HYD: నూరుద్దీన్ ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో మంగళవారం సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఎగ్జిబిషన్లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొని, విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు చదువుతోపాటు ఇతర నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. నైపుణ్యంతోనే ఉజ్వల భవిత సాధ్యమని విద్యార్థులకు సూచించారు.
KMM: కల్లూరు మండలంలో తుఫాను ప్రభావంతో ఉదయం నుండి చిరుజల్లులు కురుస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేందుకు ఆరబెట్టారు. చిరు జల్లుల రాకతో ఆరబోసిన ధాన్యంపై, పట్టాలు కప్పి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వర్షం ప్రభావం ఎక్కువైతే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్: వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం పొడిగించిందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తెలిపారు. ఈ నెల 31 నాటితో గడువు ముగియడంతో అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో 3 నెలల పాటు 2025 మార్చి31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ లేఖ జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
కామారెడ్డి: టీయూ దక్షిణ ప్రాంగణ జంతు శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులు మంగళవారం సాగుమడిలో మల్బరీ మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ డా.రాజేశ్వరి, హార్టి అండ్ సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సెరికల్చర్ అధికారి ఐలయ్య, జువాలజీ విభాగాధిపతి డా. ప్రసన్న శీల పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించారు.
WGL: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జరుగు కొత్తకొండ వీరభద్రస్వామి మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయంలో ఉత్సవాలపై సమీక్ష సమావేశాన్ని నేడు నిర్వహించారు. ఏసీపీ తిరుమల్ పాల్గొన్నారు.
KMM: జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం సమీపంలోని డబల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
BHPL: గంజాయి అక్రమ రవాణా కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గణపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రేఖ అశోక్ మంగళవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చేతుల మీదుగా క్యాష్ రివార్డును అందుకున్నారు. రవినగర్ మీదుగా గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు నిందితులను పట్టుకొని వారికి శిక్ష పడేవిధంగా కోర్టుకు ఆధారాలు సమర్పించారు.