తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ కాళ్లు మొక్కారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ తర్వాత వెంటనే మాట మార్చారని పేర్కొన్నారు.
తొలి జాబితా విడుదల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తనను అవమానించారని ఆ పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రెండో జాబితా తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కూడా అదే బాట పట్టబోతున్నారు.
మై విలేజ్ షో టీమ్ దుబాయ్లో ఉంది. దుబాయ్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా.. గంగవ్వ ముఖ్య అతిథిగా వచ్చారు. హాల్ నిండగా.. ఈలలు, కేరింతలతో సందడి నెలకొంది.
ఇచ్చిన హామీలు కర్ణాటకలో అమలు చేస్తున్నామని.. బావ, బామ్మర్దులు ఎవరు వస్తారో తేల్చుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.
తెలంగాణ ఎన్నికల తరుణంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 19 రోజుల్లో పోలీసులు చేసిన తనిఖీల్లో భాగంగా రూ.377.68 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక నవంబర్ 30 ఎన్నికల వరకు ఇది డబుల్ అవుతుందో లేదా త్రిబుల్ అవుతుందో చూడాలి మరి.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ పార్టీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు తెలిపారు. అయితే చంద్రబాబు జైళ్లో ఉండటం సహా రాష్ట్రంలో కేవలం పలువురు సెటిలర్ల ఓట్ల కోసమే పోటీ చేయడం సరికాదని పలువురు చెప్పినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేసీఆర్పై సవాల్ విసిరారు.
పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 'హిట్ టీవీ'తో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన సొంత నియోజకవర్గం పాలకుర్తిలో 70 వేల మెజారిటీతో గెలుస్తా అన్నారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కూడా తెలియని వ్యక్తి దాని గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
విశాఖపట్టణం లోక్ సభ నుంచి పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పష్టంచేశారు. ఇక్కడి ప్రజల మద్దతు తనకు ఉందన్నారు. పవన్ కల్యాణ్ కన్నా తానే బెటర్ అని ఎంపీ అన్నారని గుర్తుచేశారు.
ఢిల్లీ ఎన్సీఆర్లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది. రోజురోజుకూ పెరుగుతున్న ఆనియర్ ధరలు.. సామాన్యులకు అందేలా కనిపించడంలేదు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగిపోయింది. దీనికి గల కారణం ఏంటో వివరణ ఇవ్వమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకు లేఖ రాసింది. కానీ వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రెండు చోట్ల ఓటు ఉన్న విషయం గుర్తించే సాప్ట్ వేర్ తమ వద్ద లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ను పార్టీ అజారుద్దీన్కు కేటాయిచింది. దాంతో పార్టీకి రాజీనామా చేయాలని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ రెండో జాబితాలో చోటు దక్కని పలువురు అసంతృప్తిగా ఉన్నారు.