KMM: కల్లూరు మండలంలో తుఫాను ప్రభావంతో ఉదయం నుండి చిరుజల్లులు కురుస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేందుకు ఆరబెట్టారు. చిరు జల్లుల రాకతో ఆరబోసిన ధాన్యంపై, పట్టాలు కప్పి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వర్షం ప్రభావం ఎక్కువైతే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.