SRPT: ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ప్రజలంతా శాంతి సామరస్యాలతో ఎదుటివారిపై జాలి, కరుణ చూపాలని ఏసుక్రీస్తు చాటి చెప్పాడని రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి శ్రీవిద్యా కరుణాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకలో పాల్గొని మాట్లాడారు.