నిజామాబాద్: వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం పొడిగించిందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తెలిపారు. ఈ నెల 31 నాటితో గడువు ముగియడంతో అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో 3 నెలల పాటు 2025 మార్చి31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ లేఖ జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు.