KMM: జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం సమీపంలోని డబల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
BHPL: గంజాయి అక్రమ రవాణా కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గణపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రేఖ అశోక్ మంగళవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చేతుల మీదుగా క్యాష్ రివార్డును అందుకున్నారు. రవినగర్ మీదుగా గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు నిందితులను పట్టుకొని వారికి శిక్ష పడేవిధంగా కోర్టుకు ఆధారాలు సమర్పించారు.
HYD: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో ప్రశాంతంగా మాట్లాడుతూ.. సంబంధిత డాక్యుమెంట్ల వివరాలను సేకరించాలని సర్వే నిర్వహిస్తున్న అధికారులను కలెక్టర్ గౌతం ఆదేశించారు. మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్, లింగాపూర్ తండాలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా నమోదు ప్రక్రియను కలెక్టర్ గౌతం పరిశీలించారు.
SRD: పటాన్ చెరు మండలం బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ ఎస్పీ రూపేష్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణ, బ్యారెక్ పరిశుభ్రతను చూశారు. హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో భూ సంబంధిత కేసులు వస్తాయని వాటిలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
NLG: రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచానికి ప్రేమ, సేవ, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు.
NLG: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జున సాగర్ MLA కుందూరు జయివీర్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి హాజరై 116 మంది లబ్ధిదారులుకు చెక్కులు పంపిణి చేసి మాట్లాడారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
NLG: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జున సాగర్ MLA కుందూరు జయివీర్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి హాజరై 116 మంది లబ్ధిదారులుకు చెక్కులు పంపిణి చేసి మాట్లాడారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రయాణ ప్రాంగణంలో మంగళవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. క్రిస్టమస్ తాత వేషాదారణ ప్రయాణికులను ఆకట్టుకుంది.
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రయాణ ప్రాంగణంలో మంగళవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. క్రిస్టమస్ తాత వేషాదారణ ప్రయాణికులను ఆకట్టుకుంది.
MDK: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి గేదె మృతి చెందింది. కల్హేర్ మండల కేంద్రానికి చెందిన రైతు కోడి సాయి గొండ గ్రామ శివారులో పశువులు మేపుతుండగా ప్రమాదం జరిగింది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి రూ. 85 వేల విలువ చేసే గేదె మరణించిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు కోరారు.
MDK: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి గేదె మృతి చెందింది. కల్హేర్ మండల కేంద్రానికి చెందిన రైతు కోడి సాయి గొండ గ్రామ శివారులో పశువులు మేపుతుండగా ప్రమాదం జరిగింది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి రూ. 85 వేల విలువ చేసే గేదె మరణించిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు కోరారు.
SRPT: నకిలీ వస్తువులపై, యాప్స్పై ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ జాతీయ వినియోగ దారుల దినోత్సవంను డిజిటల్ వినియోగం, వర్చువల్ విచారణ ద్వారా వినియోగదారుల న్యాయం అనే థీమ్ ద్వారా నిర్వహించారు.
NRML: గండి రామన్న దత్త సాయి ఆలయ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని మంగళవారం నిర్వహించారు. ఆలయ చైర్మన్గా భూరాజ్, ధర్మకర్తలుగా మనోజ్, మనోహర్ కత్తి సురేష్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆనంద్ రావు బాధ్యతలు స్వీకరించారు. నూతన డైరెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, ఈవో రమేష్ లు పాల్గొన్నారు.
HNK: జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్కతుర్తి జంక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కుడా వైస్ ఛైర్మన్ అశ్విని తానాజీ వాక్కడేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సంగారెడ్డి: జిల్లా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు చర్చలకు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ క్రిస్మస్ కేకులను మంగళవారం పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చి పాస్టర్లకు కేకులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.