నేడు తెలంగాణలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. అయితే ఆమెకు అనారోగ్యం వల్ల తానే పర్యటిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.
మెదక్ ఎంపీపై కత్తి దాడి జరగడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు 4+4 భద్రతను కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం BRS, BJP, AIMIM కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కొల్లపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరీ కాంగ్రెస్ సభలో భాగంగా పేర్కొన్నారు. అంతేకాదు అధికార కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తన కలను నెరవేర్చినవాళ్లు రైతులేనని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు హుజుర్నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ ప్రసంగంతో దద్దరిల్లింది. సభలో సైదిరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రజలను కోరారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS)లో చేరారు. మరోవైపు కామారెడ్డి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై అధికార అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మరోసారి మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ (Telangana) అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్పై ఆమె కీలకోపన్యాసం చేశారు.
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న ప్రియాంక.. మొదట అక్కడి మహిళలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు.
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన చెప్పింది వాతావరణశాఖ (Weather Dept) . ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరో పక్క నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని తెలియడంతో పలువురు నాయకులు నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో కాసాని రాజీనామా చేసి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరోవైపు కాసాని రాజీనామాతో టీడీపీకి షాక్ తగినట్లయ్యింది.
కత్తి దాడికి గురైన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి యశోద ఆస్పత్రి వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తాము చూస్తూ ఊరుకోమని, హింసా రాజకీయాలు ఆపాలని హెచ్చరించారు.
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఓ ట్రాన్స్ జెండర్కు కూడా బీఎస్పీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జబర్ధస్త్ కమెడియన్ రాకేశ్ 'కేసీఆర్'కు వీరాభిమాని. ఆయన పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికోసం తన సొంత ఇంటిని తాకట్టు పెట్టానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ పలు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నాయి. తాజాగా నేడు బాన్సువాడలో సీఎం కేసీఆర్ సభను నిర్వహించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు.