MDK: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి గేదె మృతి చెందింది. కల్హేర్ మండల కేంద్రానికి చెందిన రైతు కోడి సాయి గొండ గ్రామ శివారులో పశువులు మేపుతుండగా ప్రమాదం జరిగింది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి రూ. 85 వేల విలువ చేసే గేదె మరణించిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు కోరారు.