మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఆయన గాయమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. తాజాగా వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. దాడి ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు.
మంత్రి మల్లారెడ్డి కష్టపడి కాదు.. దొంగిలించి, కొందరి ఆస్తులు కాజేసి పైకొచ్చాడని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్పై కత్తితో దాడి జరిగింది. అప్రమత్తమైన బీఆర్ఎస్ నాయకులు అతనిని ఆసుపత్రికి తరలించారు.
పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో నిరాశ చెందిన ఆయన బీఆర్ఎస్లో చేరడం ఖాయమని తెలుస్తుంది. మంత్రి హరీశ్ రావు అతని ఇంటికి వెళ్లి బీఆర్ఎస్లోకి చేరమని ఆహ్వానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించామని, ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని కుదిస్తామని తెలిపింది.
తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చంద్రబాబును తలుచుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనైన కంటతడి పెట్టారు.బాబు జైలు ఉంటే కడుపు తరుముకుపోతుందన్నారు. భగవంతుడు నాకు ఆయుష్షు ఇస్తే.. నేను బాబుకోసం చచ్చిపోతా అని చెబుతా అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాగం జనార్ధన్ రెడ్డి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. నాగం రాకతో బీఆర్ఎస్ వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది.
హైటెక్సిటీ (hitechcity) సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు చంద్రబాబు అభిమానులు తరలివచ్చారు. అలాగే ఐటీ ఉద్యోగులు దేశ, విదేశాల నుంచి వచ్చి చంద్రబాబుకు తమ మద్దతును ప్రకటించారు.
వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ కాళ్లు మొక్కారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ తర్వాత వెంటనే మాట మార్చారని పేర్కొన్నారు.
తొలి జాబితా విడుదల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తనను అవమానించారని ఆ పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రెండో జాబితా తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కూడా అదే బాట పట్టబోతున్నారు.
మై విలేజ్ షో టీమ్ దుబాయ్లో ఉంది. దుబాయ్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా.. గంగవ్వ ముఖ్య అతిథిగా వచ్చారు. హాల్ నిండగా.. ఈలలు, కేరింతలతో సందడి నెలకొంది.
ఇచ్చిన హామీలు కర్ణాటకలో అమలు చేస్తున్నామని.. బావ, బామ్మర్దులు ఎవరు వస్తారో తేల్చుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.
తెలంగాణ ఎన్నికల తరుణంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 19 రోజుల్లో పోలీసులు చేసిన తనిఖీల్లో భాగంగా రూ.377.68 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక నవంబర్ 30 ఎన్నికల వరకు ఇది డబుల్ అవుతుందో లేదా త్రిబుల్ అవుతుందో చూడాలి మరి.