SRPT: చివ్వెంల మండలం దురాజుపల్లిలో త్వరలో జరగనున్న పెద్దగట్టు జాతర యొక్క పరిసరాలను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు పరిశీలించారు. జాతర యొక్క పరిసరాలను, దేవాలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం దైవ దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. డీఎస్పీ రవి, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ సిబ్బంది ఉన్నారు.