KMR: కేంద్ర మంత్రి అమిత్ అంబేడ్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.