జనగామ: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిజిటల్ విధానం, వర్చువల్ విచారణల ద్వారా వినియోగదారులకు సత్వర న్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు.