మహబూబ్ నగర్: విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని, మోసపూరిత మాటలు, వారు అందించి తినుబండారాలు తీసుకోరాదని షీ టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. మంగళవారం నారాయణపేట మండలం సింగారం కూడలిలో వున్న సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కలశాల విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
HYD: ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మొత్తం 160 మందికి మంజూరైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరగాలని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్.
HYD: బాలాజీ నగర్ డివిజన్ రెయిన్కు విస్టాస్ వద్ద ఏర్పాటు చేస్తున్న STP పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ బాబురావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు ఏళ్లుగా STP నిర్మాణ పనుల జాప్యానికి అధికారులే కారణమని.. అధికారులు సమన్వయం చేసుకొని త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
WNP: జిల్లాలో సిమెంట్, బూడిదతో చేసిన ఇటుకల నిర్మాణ యూనిట్లు నెలకొల్పేందుకు యువత, మహిళలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, నిరుద్యోగ యువత ముందుకు వచ్చి ప్రతి మండలంలో కనీసం 3 సిమెంట్ ఇటుకల యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి కళాశాలకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. యువతి(19) గజ్వేల్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. నిన్న కళాశాలలో పరీక్ష ఉందంటూ వెళ్లి కనిపించకుండా పోయింది. రాత్రి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
WNP: వనపర్తి ముఖచిత్ర క్యాలెండర్ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాజుల కాలం నుంచి విద్యాపర్తి వరకు వనపర్తి చరిత్ర కళ్లకు కట్టినట్టుగా చూపారని అన్నారు. అందరూ కలిసి వనపర్తి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఐక్యవేదిక సభ్యులను కోరారు. క్యాలెండర్ను రూపొందించిన సతీష్ యాదవ్ను అభినందిచారు.
JN: చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ నేతలు సిద్దిపేట జిల్లా కలెక్టర్కు మనూ చౌదరి మంగళవారం వినతి పత్రం అందించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను రెవెన్యూ డివిజన్గా వెంటనే ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. జేఏసీ ఛైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి తదితరులున్నారు.
SRPT: మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని సీబీఎస్ఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి అఖిల్ కుమార్ అన్నారు. ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ముందు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని అన్నారు. ఫ్యాక్టరీ పూర్తయితే నీరు, గాలి, భూమి కాలుష్యమై పంటలు పండకుండా ఎడారిగా మారుతుందన్నారు. పలువురు పాల్గొన్నారు.
MDK: నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిని కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నేరళ్లపల్లిలో జనార్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లిన నాయకులు జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.
NLG: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే సామేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు అమలు చేస్తుందన్నారు.
GDL: క్రిస్మస్ పర్వదిన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అయిజ ఎస్ఐ విజయభాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం పీఎస్లో మీడియాతో మాట్లాడుతూ.. క్రిస్టియన్ సోదరులు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రార్థన సమయంలో సమన్వయం పాటించి సమాజంలో శాంతి నెలకొల్పాలన్నారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
NZB: బీజేపీపై నిరాధార ఆరోపణలు చేసిన మానాల మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ మున్సిపల్ ఇంఛార్జ్ ఆరే రవీందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం భీమ్గల్ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రూ.25 కోట్లు వివిధ రూపాల్లో సంక్షేమ పథకాలకు ఇచ్చిందన్నారు.
SRPT: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సామేలు మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కమిషనర్, తహసీల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్: యూనివర్సిటీ పదవులలో బీసీలను నియమించకపోతే ఊరుకొబోమని ఉన్నత విద్యా మండలి ఎదుట నిరసన చేస్తామని BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ హెచ్చరించారు. కేయూలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమణలకు గురవుతున్న విశ్వవిద్యాలయాల భూములను హైడ్రాతో కాపాడాల్సిందే అని, ఖాళీలను భర్తీ చేసి యూనివర్సిటీలను బలోపేతం చేయాలన్నారు.
SRPT: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం మోతే మండల కేంద్రంలో జరిగిన సీపీఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే వేగవంతం చేసి ఇల్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని కోరారు.