కామారెడ్డి: పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ ఛైర్మన్ సౌద్గర్ అర్వింద్ పాల్గొన్నారు.
మహబూబాబాద్: దంతాలపల్లి మండల కేంద్రంలో నేడు క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ప్రారంభించారు. క్రైస్తవ ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి క్రైస్తవులకు ఏసుప్రభువు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పాస్టర్లు ఫాదర్లు పాల్గొన్నారు.
సిద్దిపేట: అగ్నివీర్, వాయు నియామకాలకు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా జాబ్ నోటిషికేషను విడుదల చేసిందని కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు జనవరి 1, 2005 నుంచి జూలై 1, 2008 మధ్య జన్మించిన అవివాహిత స్త్రీ/పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు ఆసక్తి గలవారు 2025 జనవరి 7 నుంచి 27 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు.
మహబూబ్ నగర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. అమ్మాయిపల్లి గ్రామాల్లో సహకార సంఘాల ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. సేకరించిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లులకు తరలించాలన్నారు.
ఖమ్మం: తెలంగాణ ప్రాసెసింగ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం సమగ్ర శిక్ష ఉద్యోగులు అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చి వారి దీక్షను విరమింపచేసేలా చర్యలు తీసుకోవాలని TPTF జిల్లా కౌన్సిలర్ చిన్నారావు అడిషనల్ కలెక్టర్ను కోరారు.
NZB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళ వారం మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే పనులు త్వరగా పూర్తిచేసి ఆన్ లైన్లో పొందుపరచాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్, ఎంపీడీవో ప్రకాశ్, అధికారులు ఉన్నారు.
NZB: ఆర్మూర్ ఇన్నాళ్లు ఊరించిన పసుపు బోర్డు విషయం ఏమైందని ఎంపీ అర్వింద్ను విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్మన్ సుంకేట్ అన్వేష్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్మూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు ప్రకటన.. పాలాభిషేకానికే పరిమితమైందన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ ఛైర్మన్ జీవన్, నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు సెంటర్ను డీసీఎంఎస్ ఛైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెన్నుపూసల సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.
HNK: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో ముఖ్యఅతిథిగా MLA పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో అన్ని మతాలు కులాలు సమానమని ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శం అన్నారు.
HNK: గ్రేటర్ వరంగల్ పరిధిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఫిర్యాదు చేస్తున్న ప్రజా సంఘాల నాయకులపై అమానుషంగా ప్రవర్తిస్తున్న కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
కరీంనగర్: కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నుంచి నిధులతో అభివృద్ధి పనుల గురించి ఈ సమావేశమని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో నేను ఉన్న కరీంనగర్ ప్రజలు పనిచేసే బాధ్యత నాపై ఉందని బండి సంజయ్ అన్నారు.
నారాయణపేట: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27, 28న కార్మికులు చేపట్టే సమ్మెకు సంబంధించిన నోటీసులను మంగళవారం సీఐటీయు నాయకులు నారాయణపేట డీపీఓకు అందించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 6న జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విన్నవించగా వాటిని పరిష్కరించలేదని.
MNCL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో మంగళవారం బీసీ, బహుజన సంఘాల ఆధ్వర్యంలో పెరియార్ 51వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పెరియార్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. శాస్త్రీయ సమాజం కోసం తన జీవితాంతం పోరాడిన ఉద్యమ జీవి పెరియార్ అని కొనియాడారు.
SRD: పటాన్ చెరు మండల పరిధిలోని పోచారం గ్రామంలో మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ నిర్వహకులు, గ్రామస్తులు ఉన్నారు.