MDK: నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిని కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నేరళ్లపల్లిలో జనార్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లిన నాయకులు జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.