NLG: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే సామేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు అమలు చేస్తుందన్నారు.