NRPT: విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత మాటలు, వారు అందించిన తినుబండారాలు తీసుకోరాదని షీ టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. మంగళవారం నారాయణపేట మండలం సింగారం కూడలిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. అంటరానితనం ప్రదర్శించరాదని, అందరూ కలిసిమెలసి ఉండాలని చెప్పారు.