NLG: రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచానికి ప్రేమ, సేవ, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు.