NLG: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జున సాగర్ MLA కుందూరు జయివీర్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి హాజరై 116 మంది లబ్ధిదారులుకు చెక్కులు పంపిణి చేసి మాట్లాడారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.