కామారెడ్డి: టీయూ దక్షిణ ప్రాంగణ జంతు శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులు మంగళవారం సాగుమడిలో మల్బరీ మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ డా.రాజేశ్వరి, హార్టి అండ్ సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సెరికల్చర్ అధికారి ఐలయ్య, జువాలజీ విభాగాధిపతి డా. ప్రసన్న శీల పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించారు.