• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యార్థులు ఉన్నా.. ఉపాధ్యాయులు ఎక్కడా..?

MBNR: మాగనూర్ మండలంలోని పుంజానూర్‌లో ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం చెప్తున్నా పాఠశాలలో మాత్రం ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.

December 25, 2024 / 07:09 AM IST

తాండూరు మండలంలో పులి సంచారం.. ?

VKB: తాండూరు మండలంలోని నీలాయపల్లికి కూత వేటు దూరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలియడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దూడపై దాడి చేసింది పెద్దపులా.. చిరుత పులా అనేది తెలియాల్సి ఉంది. దూడపై పులి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

December 25, 2024 / 07:08 AM IST

ఎమ్మెల్యే ని కలిసి వినతి పత్రాలు అందజేత

మేడ్చల్:  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ని మంగళవారం కలిసి పలు ఆహ్వాన పత్రికలు, వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

December 25, 2024 / 06:53 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.2.50 లక్షల మద్యం సీజ్

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా రవాణ చేస్తున్న మద్యం బాటిళ్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైల్లో రూ.2.50 లక్షల విలువైన 76 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఏపీ, చంఢీగఢ్ రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

December 25, 2024 / 06:35 AM IST

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌తో మలేషియా ప్రతినిధులు భేటీ

HYD: హైదరాబాద్‌ బుద్ధభవన్‌ కార్యాలయంలో తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ శారదతో మలేషియా ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. మహిళల హక్కులు, రక్షణకే కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు ఛైర్‌పర్సన్‌ వారికి సూచించారు. సమాజంలో మహిళల పట్ల వివక్షతను తొలగించి, సాధికారత గురించి బృందానికి ఆమె తెలిపారు.

December 25, 2024 / 06:19 AM IST

కోర్టు ఏర్పాటుకు భవననాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు కోసం మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎంపీడీవో భవనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

December 25, 2024 / 06:16 AM IST

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

WNP: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాచలం కోరారు. వనపర్తిలో మంగళవారం ఏర్పాటు చేసిన టీఎస్ యూటీఎఫ్ 5వ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యను రక్షించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. టీచర్ల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, నాలుగు పెండింగ్ డీఎలను విడుదల చేయాలని కోరారు.

December 25, 2024 / 06:14 AM IST

తప్పిపోయిన వ్యక్తి.. నీటిలో శవమై తేలాడు

NGKL: తప్పిపోయిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన ఘటన కల్వకుర్తిలో జరిగింది. ఎస్సై మాధవ రెడ్డి తెలిపిన వివరాలు.. చారగొండ మండలంలోని తుర్కలపల్లికి చెందిన పర్వతం పుల్లయ్య గత నెల 20న తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నారు. పుల్లయ్య మృతదేహాన్ని కల్వకుర్తి పట్టణ సమీపంలోని ఓ నీటి కుంటలో మంగళవారం సాయంత్రం కనుకున్నట్లు ఆయన తెలిపారు.

December 25, 2024 / 06:01 AM IST

రేపు MRPS నేతల సమావేశం

HYD: సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కళా మండలి అధ్యక్షుడు అశోక్ మాదిగ రామచంద్ర మాదిగ డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర సమావేశం అల్వాల్ లోతుకుంటలో నిర్వహిస్తామని మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

December 25, 2024 / 05:58 AM IST

నేడు కోయిల్ సాగర్ నుంచి నీటి విడుదల చేయనున్న ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ కుడి, ఎడమ కాల్వలకు బుధవారం సాగు నీటిని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విడుదల చేయనున్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారని ప్రాజెక్టు అధికారి ప్రతాప్ సింగ్ తెలిపారు.

December 25, 2024 / 05:39 AM IST

పథకాలు సాధించిన ప్రణీతను సత్కరించిన ఎమ్మెల్యే

KMM: పరుగు పందెంలో మూడు పథకాలు సాధించిన సత్తుపల్లికి చెందిన కొమ్ము ప్రణీతను ఎమ్మెల్యే రాగమయి సత్కరించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ గురు గోవింద్ స్టేడియంలో జరిగిన 76వ జాతీయ స్కూల్ గేమ్స్ 600మీ, 400మీ.ల పరుగు పందెంలో పాల్గొని రెండు వెండి పథకాలను, 200 మీ.ల పరుగు పందెంలో విజయం సాధించి కాంస్య పథకాన్ని సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు అభినందించారు.

December 25, 2024 / 05:25 AM IST

అమ్మాపూర్ గ్రామానికి చెందిన బాలుడు అదృశ్యం!

MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎర్రమందెల దశరథ్ కుమారుడు అఖిల్(6) అదృశ్యమయ్యాడు. అమ్మాపూర్ గ్రామంలో నిన్న మధ్యాహ్నం తన ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

December 25, 2024 / 05:22 AM IST

నేడు క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న ఎమ్మెల్యే

KMM: కామేపల్లి మండలం ముచ్చర్ల లక్ష్మీ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి తెలిపారు. వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తెలంగాణ అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

December 25, 2024 / 05:18 AM IST

వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే హెచ్చరిక

KMM: ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు ఎప్పుడు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు.

December 25, 2024 / 05:13 AM IST

ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. పలువురికి తీవ్ర గాయాలు

KMM: వైరా మండలంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వంశీ కృష్ణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 25, 2024 / 05:09 AM IST