కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తనపై, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతాయని రెండు రోజుల క్రితం పొంగులేటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో హోం రూల్ పాటించాలనే ఉద్దేశంతోనే తాను దశాబ్ద కాలం పాటు పోటీకి దూరంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం తమ పార్టీ అభ్యర్థులకు ఆయన బీఫామ్లు అందించారు.
తనకు ఇస్తానన్న టికెట్ను ఆఖరి నిమిషంలో వేరొక వ్యక్తి ఇవ్వడంతో బాన్సువాడ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందు తాగడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.
కామారెడ్డి, గజ్వేల్ ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. ఈ తరుణంలో కామారెడ్డిలో రేపు భారీ బహిరంగ సభ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోకి ఎంత మంది పీకేలు, డీకేలు వచ్చినా ఏకే47 లాంటి సీఎం కేసీఆర్ను ఏం చేయలేరన్నారు.
ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆమె పాల్గొన్నారు.
ప్రస్తుత కాలంలో కాదేదీ కల్తీకి అనట్టు చేస్తున్నారు కేటుగాళ్లు. చిన్న పిల్లలు తినే చాకెట్లు కూడా కల్తీ చేస్తూ గలీజు దందా నిర్వహిస్తున్నారు. కాసులు కోసం కక్కుర్తి పడి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఈ తరుణంలో ఆయన రోడ్డు మార్గం ద్వారా ఆసిఫాబాద్ సభకు బయల్దేరి వెళ్లారు.
కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గంగుల కమలాకర్ ఎన్నిక అనర్హత పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
తెలంగాణ ఎన్నికలకు ముందు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్ల వద్ద ఓటు వేయనివారికి సహాయకులుగా వచ్చిన వ్యక్తులకు ఇంక్ మార్క్ పెట్టనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం డీప్ఫేక్ అంశంపై సినీ ప్రముఖులతోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటివల రష్మిక మందన్నా ఫోటో మార్పింగ్ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. మేడ్చల్ నియోజకవర్గంలో పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ ఈ నెల 20లోగా పూర్తి కావాలని చేయాలని ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అజయ్ వి నాయక్ తెలిపారు
తెలంగాణలోని 9 స్థానాల అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ బీఫాంలను అందించారు. మరో వైపు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తూ విజేయుడికి బీఫాంను అందించారు.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల భీకర వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఇక్కడ సభను నిర్వహించే తాను ప్రధానిని అయ్యానని మోదీ అన్నారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నట్లు తెలిపారు.