MBNR: మాగనూర్ మండలంలోని పుంజానూర్లో ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం చెప్తున్నా పాఠశాలలో మాత్రం ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.