• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘పార్టీ బలోపేతానికి బూత్ కమిటీల అధ్యక్షులు కృషి చేయాలి’

KMR: పట్టణం 2వ వార్డు పరిధిలోని అడ్లుర్ గ్రామ బీజేపీ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్ధాగత మార్పుల్లో భాగంగా186 బూత్ అధ్యక్షుడిగా మహేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్ బూత్ అధ్యక్షులను సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

December 25, 2024 / 10:32 AM IST

నిజాయితీ చాటుకున్న దేవరకొండ ఆర్టీసీ ఉద్యోగులు

NLG: దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ నాగమణి, డ్రైవర్ జగదీష్ బస్సులో దొరికిన రూ. 30వేల విలువ గల మొబైల్‌ను డిపోలో అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు. నల్గొండ- దేవరకొండ రూట్లో నడుస్తున్న బస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా ప్రయాణికురాలు మొబైల్ పోగొట్టుకుంది. అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు విచారణ జరిపి బాధితురాలికి బుధవారం మొబైల్ అందజేశారు.

December 25, 2024 / 10:30 AM IST

నేటి అర్ధరాత్రి వరకు MMTS రైళ్లు

HYD: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు MMTS రైళ్ల సమయాన్ని పొడిగించారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్ నామా, ఫలక్ నామా-లింగంపల్లి స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి 10:45 నుంచి అర్ధరాత్రి 12:55ని.ల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

December 25, 2024 / 10:27 AM IST

లేగదూడపై చిరుత దాడి

MBNR: దౌల్తాబాద్ మండలంలోని చల్లాపూర్‌లో చిరుత లేగదూడపై దాడిచేసి చంపిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోలుముల సాయప్ప రోజులాగే తన పొలం దగ్గర పశువులను కట్టేసి రాగా.. చిరుతలు లేగదూడను లాక్కెళ్ళి చంపేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు.

December 25, 2024 / 10:26 AM IST

సౌత్ జోన్ క్రికెట్ జట్టు ఎంపిక

MBNR: పాలమూరు యూనివర్సిటీ క్రికెట్ పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు ఎంపికలు నిర్వహించినట్లు యూనివర్సిటీ పీడీ వై.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రో. శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప, OSD మధుసుదన్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, అబ్దుల్లా పాల్గొన్నారు.

December 25, 2024 / 10:24 AM IST

హైదరాబాద్‌లో ఉదయం దోశ.. రాత్రి బిర్యానీ

HYD: హైదరాబాదీలు బిర్యానీ ప్రియులు. నిమిషానికి 34బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. ఏడాదిలో 1.57కోట్ల ప్లేట్ల బిర్యానీలను ఆరగించారు. హైదరాబాద్‌కు సంబంధించి స్విగ్గీ విడుదల చేసిన ఆర్డర్లే ఇలాఉంటే మిగతా సంస్థలవి, రెస్టారెంట్‌లో, వేడుకల్లో ఆరగించే విందులను కలుపుకొంటే బిర్యానీల సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువే. అత్యధికులు చికెన్ బిర్యానీనే ఆరగిస్తున్నారు.

December 25, 2024 / 10:23 AM IST

అనిల్ జాదవ్‌ను కలిసిన శబరిమాత ఆశ్రమ సభ్యులు

ADB: ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసిన బోథ్ మండల కేంద్రానికి చెందిన శబరిమాత ఆశ్రమ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శబరిమాత ఆశ్రమ షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

December 25, 2024 / 10:22 AM IST

నాంపల్లి స్టేషన్ పునరాభివృద్ధి షురూ

HYD: నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నిత్యం 50వేల మందికి సేవలు అందించేలా ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.309 కోట్లను రైల్వేశాఖ ఖర్చు చేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రయత్నిస్తోందని CPRO శ్రీధర్ వెల్లడించారు.

December 25, 2024 / 10:22 AM IST

ఫ్యూచర్ సిటీ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రూ.2వేల కోట్లు

HYD: పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తొలి దశలో భాగంగా రావిర్యాల్ నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న 41.5 కి.మీ రహదారికి సంబంధించి పనులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.2,000 కోట్లు మంజూరు చేస్తూ పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది.

December 25, 2024 / 10:20 AM IST

క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

NGKL: క్రిస్మస్ సందర్భంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైనదని ఆయన అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలన్నారు.

December 25, 2024 / 10:19 AM IST

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు

SRD: క్రిస్మస్ వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. పటాన్ చెరు డివిజన్ జెపి కాలనీ మరనాద చర్చి, శాంతినగర్ కాలనీలోని సీఎస్సై చర్చిలలో క్రిస్మస్ వేడుకలకు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు.

December 25, 2024 / 10:15 AM IST

జనవరి ఒకటి నుంచి నుమాయిష్.. విస్తృత ఏర్పాట్లు

HYD: జనవరి ఒకటి నుంచి ప్రారంభమయ్యే ‘నుమాయిష్’కు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏటా 46 రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నిర్వహిస్తారు. 84వ ప్రదర్శనకు ఇప్పటికే స్టాళ్ల కేటాయింపు పూర్తయ్యింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

December 25, 2024 / 10:15 AM IST

నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇలా

MDK: జిల్లాలో నేడు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్కు హెలికాప్టర్లో వస్తారు. అనంతరం వనదుర్గమాతను దర్శించుకుని పూజలో పాల్గొంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 11:45కి మెదక్ చర్చికి వెళ్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఎస్పీ కార్యాలయం వద్ద గల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్తారు.

December 25, 2024 / 10:14 AM IST

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన గ్రంథాలయ ఛైర్మన్

WNP: పాన్‌గల్ మండలం మహ్మదాపూర్ గ్రామంలోని అర్హులైన 10 మందికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 25, 2024 / 10:12 AM IST

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జాన్సన్ నాయక్

NRML: ఖానాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో పాస్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఆ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యేసుక్రీస్తు అందించిన శాంతి బోధనలు అందరికీ ఆచరణీయమన్నారు.

December 25, 2024 / 10:09 AM IST