తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా. వాస్తవానికి రాష్ట్ర బడ్జె...
తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. నిన్న అంతా ఒకే అనుకుంటే తెల్లారే గాంధీభవన్ లో వివాదం రాజుకుంది. పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేస్తున్న కోమటిరెడ్డి లాంటి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ ఓటమికి కోమటిరెడ్డి కారణమని...
దక్కన్ షాపింగ్ మాల్లో కాలిన మృతదేహన్ని రెస్క్యూ సిబ్బంది ఈరోజు (శనివారం) గుర్తించారు. మొదటి అంతస్తు వెనకభాగంలో అది కనిపించిందని తెలిపారు. మాంసపు ముద్దలు కూడా ఉన్నాయన్నారు. వాటిని మెడికల్ టెస్ట్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామన్నారు. డీఎన్ఏ చేసిన తర్వాత చనిపోయింది ఎవరో తేలే అవకాశం ఉంది. మరో ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. ఆనవాళ్ల కోసం గాలింపు చేపడుతున్నారు. వేడి వల్ల ఆటంకం కలుగుతుంది. ఈరోజు ఉదయం ఇంజ...
ఇఫ్లూలో దారుణం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. ఆమె ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విద్యార్థిని ఆత్మహత్యపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఆరోపణ...
విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించాలి. వాటిపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెను ప్రమాదాలు సంభవిస్తాయి. వాషింగ్ మెషీన్ ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. ప్రస్తుతం వారు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమవగా.. మంటలు వ్యాపించాయి. ఇంటి బయట పార్క్ చేసిన కారు కూడా పగిలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ క...
తెలంగాణ ఆర్టీసీ క్రమంగా గాడీన పడుతోంది. నష్టాల నుంచి గట్టెక్కుతోంది. ప్రయాణికులకు రవాణా సేవలు మరింత చేరువవుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడంతో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. పండుగ రద్దీని తట్టుకుని పకడ్బందీగా సేవలు అందించి ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంది. సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఆర్టీసీ ప్రైవేటు కార్యక్రమాలకు కూడా బస్సులను అద...
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారని… పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. నిజానికి ఈ నెల 19నే ఆయన హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల.. ఆ పర్యటన వాయిదా పడింది. అందుకే వచ్చే నెలలో రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న ఆయన తెలంగాణలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటుగా పలు అభివ...
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికొక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన ఐటీ మంత్రి అయ్యాక ఏపీకి ఒక్క పరిశ్రమ వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను తిట్టడానికే అమర్ నాథ్ లాంటి వాళ్లు మంత్రులుగా అయ్యారని తెలిపారు. ఆయన తిట్టడానికి తప్ప పరిశ్రమలు తీసుకురావడానికి పనిక...
తెలంగాణ సచివాలయంలో శాఖల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖ మరో శాఖ విలీనమైంది. గృహ నిర్మాణ శాఖను రవాణా, రోడ్లు, భవనాల శాఖలోకి విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్లో కొత్త పథకాలేవీ చేపట్టకపోవడంతో, హౌ...
తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలను, అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షిస్తున్నాయి. దావోస్ వేదికగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండగా.. ప్రముఖ అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా రూ.36, 300 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఈ పెట్టుబడులు పెట్టనున్...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై శుక్రవారం మంత్రి సబిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య...
రోడ్లు ఖాళీగా ఉన్నాయి.. ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేరు. ఇంకేం రయ్ మంటూ దూసుకెళ్దామని అనుకుంటే హీరోకు జరిగినట్టే జరుగుతుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయనే ఉత్సాహంతో బైక్ ను యమ స్పీడ్ తో వెళ్లాడు. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కాడు. పోలీసులు లేకున్నా ఎలా చిక్కాడని అనుకుంటున్నారా? మన ట్రాఫిక్ పోలీసుల డేగకళ్లు ఉన్నాయేగా. ఆత్రుత ఆపుకోలేకపోయి పోలీసులకు దొరికినట్లు ఆ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ నట...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీతో అంటీ అట్టనట్టు ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్లోకి అడుగు పెట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. కాగా.. అందరికీ షాక్ ఇస్తూ ఈరోజు గాంధీ భవన్ లో ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక...
జాతీయ పార్టీ గల్లీ పార్టీగా తయారవుతోంది. గ్రూపు రాజకీయాలతో సొంత పార్టీనే బజారుకీడిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదు. వాళ్ల గ్రూపు రాజకీయాలతోనే వాళ్లే తమ పార్టీని ఓడించుకుంటారనే ఛలోక్తి రాజకీయాల్లో ఉంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ లో పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా పార్టీ నాయకులు చే...
మాస్టర్ ప్లాన్ పేరిట తమ పొలాలను లాక్కొవద్దనే డిమాండ్ తో కామారెడ్డి, జగిత్యాల రైతులు చేస్తున్న పోరాటం విజయం దిశగా సాగుతోంది. వారి పోరాటాలకు మున్సిపల్ కౌన్సిల్స్ దిగొస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలని ఆయా మున్సిపల్ కౌన్సిల్స్ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. దీంతో త్వరలోనే ఆ ముసాయిదాలు రద్దయ్యే అవకాశం ఉంది. రైతుల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ముసాయిదాల రద్దుకే మొగ్గు చూపనుంది. జగిత్...