• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపటి నుంచి ప్రారంభ కానున్న ఇంటర్ పరీక్షలు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పరిరక్షణలో, పరీక్షల నిర్వహణ జరుగుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:24 AM IST

శతాధిక వృద్ధురాలు ఫ్రీడమ్ ఫైటర్ మృతి

BHNG: రాజాపేట మండలం బేగంపేటకి చెందిన శతాధిక వృద్ధురాలు ఫ్రీడమ్ ఫైటర్ వలిమెల లక్ష్మి (106) సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె భర్త హన్మంత్ స్వాతంత్ర సమర యోధుడు. జైలు జీవితం కూడా గడిపారు. 106 సంవత్సరాలకు పైగా జీవించిన లక్ష్మి రజాకార్లతో పోరాటం, బాధలు, బాధ్యతలు, మనుమరాండ్లతో సుఖదుఃఖాలు, మనుమలు, పరిపూర్ణ జీవనం గడిపారని గ్రామస్తులు సంతాపం తెలిపారు.

February 24, 2026 / 10:22 AM IST

వనపర్తి రేవల్లి యూరియా బుకింగ్ ప్రారంభం

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్, రేవల్లి సొసైటీల్లో యూరియా పంపిణీ కోసం స్లాట్ బుకింగ్ ఓపెన్ అయిందని అధికారులు తెలిపారు. నాగపూర్ సొసైటీలో 300 బస్తాలు, రేవల్లి సొసైటీలో 300 బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదికారులు సూచించారు.

February 24, 2026 / 10:20 AM IST

లాభాల మాయలో లక్షల మోసం

BDK: బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. అధిక లాభాల పేరుతో బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన మహిళ నుంచి రూ.1.82 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

February 24, 2026 / 10:19 AM IST

న్యాయవాది కళ్యాణిని పరామర్శించిన BJP అధ్యక్షుడు

NZB: రుద్రూర్‌లో న్యాయవాది కళ్యాణి నివాసానికి బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మంగళవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కళ్యాణికి ధైర్యం చెప్పి, పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా దినేశ్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 10:19 AM IST

కొడంగల్‌లో మెరిసిన ఒగ్గుడోలు కళకారుల విన్యాసం

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహించిన బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రలో ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ప్రదర్శనలు భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేశాయి.

February 24, 2026 / 10:19 AM IST

బావను కిరాతంగా నరికిచంపిన మరదలు

HNK: హసన్ పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో మంగళవారం బాల్నే మొగిలి సొంత మరదల చేత దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొగిలిని గొడ్డలితో, కత్తులతో అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా,  హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 10:19 AM IST

వేరుశనగ పంట వేశారా..? అధిక దిగుబడికి ఇలా చేయండి

RR: రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు టీసీజీఎస్-1694 ‘విశిష్ట’ వేరైటీ వేరుశనగ పై ఫీల్డ్ డే నిర్వహించారు. పూత దశలో తగిన నీరు, జిప్సం, జింక్ వినియోగంతో దిగుబడి పెరుగుతుందని డా. సంతోష్ కుమార్ సూచించారు. పంట విస్తీర్ణం, నాటే దూరం, సమతుల ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, యాంత్రీకరణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.

February 24, 2026 / 10:16 AM IST

నేడు ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటేరియట్ కార్యక్రమం

NLG- తమ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, నేడు ఆర్టీసీ కార్మికులు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా కార్మిక జేఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

February 24, 2026 / 10:16 AM IST

రేపు ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు

WGL: ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం (మార్చి 4), సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం (మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా WGL-12,166, HNK-38,600, JN-8,605, MHBD-8,287, BHPL-3,778, MLG-3,841 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:13 AM IST

బాల్యవివాహ విముక్తి రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

HYD: బాల్య వివాహాల రహిత సమాజాన్ని నిర్మిద్దామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. బాల్యవివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనం ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. 18 ఏళ్లలోపు యువతులకు, 21 ఏళ్లలోపు యువకులకు పెళ్లి చేస్తే బాల్య వివాహం కిందికి వస్తుందన్నారు.

February 24, 2026 / 10:12 AM IST

ఓవైపు పార్కింగ్.. మరోవైపు పాడుబడ్డ బండ్లు..?

MDCL: KPHB 4వ ఫేజ్ దేవాలయ సముదాయాల ప్రధాన రహదారిలో ఓవైపు వాహనాలు, మరోవైపు గోడల పక్కన పాడుబడ్డ బండ్లు ఉండటంతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ఇబ్బంది పడుతున్నట్లుగా పలువురు వాహనదారులు వాపోయారు. దీంతో రోడ్డుపై ప్రయాణించడానికి చాలా కష్టంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

February 24, 2026 / 10:11 AM IST

‘విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు’

MNCL: వేసవి దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారి రాజన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగిందని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పలు ఉపకేంద్రాల్లో పవర్ ట్రాన్స్ ఫార్మర్‌లు అందుబాటులోకి తెచ్చామన్నారు.

February 24, 2026 / 10:06 AM IST

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సోమవారం వచ్చిన ఆదాయం వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.79,862, ప్రసాదాల ద్వారా రూ.59,080, అన్నదానం ద్వారా రూ.14,044 ఆదాయం లభించింది. మొత్తంగా రూ.1,53,986 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

February 24, 2026 / 10:06 AM IST

మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి: AITUC

ADB: మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ.. వేతనాలు రాక కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వేతనాలు చెల్లించని పక్షంలో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 10:04 AM IST