• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేటి మిర్చి ధరలు ఇలా..

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.18400, క్వింటాల్ 341 (కారం కాయ) ధర రూ.21000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ.24000, క్వింటాల్ వండర్ హాట్ మిర్చి ధర రూ.37000, క్వింటాల్ టమాటో మిర్చి ధర రూ.40000గా పలికింది. నేడు మార్కెట్లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 09:50 AM IST

కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో స్వయం సహాయక సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 09:46 AM IST

షాపల్లి, అమ్మనబోలులో బెల్టు దుకాణాలు బంద్

NLG: నార్కట్‌పల్లి మండలం, షాపల్లి, అమ్మనబోలు గ్రామ పంచాయతీలు గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి హెచ్చరించింది. అటు అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఈ మార్పు ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో వేచి చూడాలి మరి.

February 26, 2026 / 09:46 AM IST

ద్వితీయ సంవత్సర పరీక్షలు.. జమ్మికుంటలో 3 కేంద్రాలు

KNR: ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 3 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 424, వొకేషనల్ విద్యార్థులు 245 మంది హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

February 26, 2026 / 09:43 AM IST

మంత్రిని కలిసిన నూతన పాలకవర్గం

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వెంకటస్వామిని కలిశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వనిత, వైస్ ఛైర్మన్ షఫీ అహ్మద్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.

February 26, 2026 / 09:43 AM IST

టాలెంట్ టెస్ట్‌లో పల్వంచ విద్యార్థిని టాప్

KMR: పల్వంచ మండలానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యాశ్రీ జిల్లా స్థాయి బయోసైన్స్ టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచింది. కామారెడ్డిలో నిర్వహించిన పరీక్షలో మొత్తం 97 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యాశ్రీని జిల్లా విద్యాధికారి రాజు, మెమెంటోతో సత్కరించినట్లు ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

February 26, 2026 / 09:39 AM IST

నేడు అదిలాబాద్‌లో వాహనాల వేలం పాట

ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలలో వివిధ కేసులు పట్టుబడిన వాహనాలకు గాను గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో వేలం వేయనన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వం నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలు పాల్గొనవచ్చు అని వెల్లడించారు.

February 26, 2026 / 09:39 AM IST

మందుబాబుకు ఐదు రోజుల జైలు శిక్ష

NZB: డ్రంక్&డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో వేంపల్లికి చెందిన అదిగేమ్ రాజేశ్వర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. బుధవారం నిందితుడిని ఆర్మూర్ జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ భవ్యశ్రీ ఎదుట హాజరుపరచగా,ఐదు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

February 26, 2026 / 09:34 AM IST

నిర్మల్ అదనపు కలెక్టర్ బదిలీ

నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా బదిలీ చేయగా, జిల్లాలో తన పదవీ కాలంలో సమర్థవంతంగా సేవలు అందించిన ఫైజాన్ అహ్మద్, త్వరలోనే కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

February 26, 2026 / 09:32 AM IST

పంచాయతీ బకాయిలు రావడంలేదని ఆందోళన

GDWL: ఇటిక్యాల మండలంలో పంచాయతీల బకాయిలు విడుదలకావడంతో క్రిత సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకుంటున్నారు. 32 గ్రామాలు ఉన్న మండలంలో ఒక్కో పంచాయతీకి సుమారు రూ.20–25 లక్షల బకాయిలు రావాల్సినప్పటికీ, పారిశుద్ధ్య, సీసీ రోడ్, ట్రాక్టర్ పనులకు ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులు ఇంకా రావడం లేదని అధికారులు, సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 09:28 AM IST

HYDలో మసాజ్ పేరుతో వ్యభిచారం..!

HYD: మహానగరంలో “మసాజ్ సెంటర్ల” పేరుతో వ్యభిచారం నడుస్తున్నట్లు పలు కేసుల్లో వెలుగుచూసింది. రూ. లక్ష వరకు ఇస్తామని చెప్పి బంగ్లాదేశ్, థాయిలాండ్ ప్రాంతాల నుంచి మహిళలను నిర్వాహకులు రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యూటీ పార్లర్ ముసుగులోనూ ఈ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు నిరంతర నిఘా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

February 26, 2026 / 09:26 AM IST

కలుషిత నీటి తొట్టెతో కాలనీవాసుల్లో ఆరోగ్య ఆందోళన

VKB: పులుమడ్డిలోని ఎస్సీ కాలనీలో తాగునీటి తొట్టె నెలలుగా శుభ్రం చేయకపోవడంతో నీరు నాచుపట్టి దోమల పెంపక కేంద్రంగా మారింది. దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. సమస్యపై పలుమార్లు తెలియజేసినా స్పందన లేదని తెలిపారు. వెంటనే తొట్టెను శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు అందించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

February 26, 2026 / 09:23 AM IST

ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప అవార్డు బృందం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను బుధవారం కాయకల్ప అవార్డు బృందం సందర్శించారు. డాక్టర్ విజయ శంకర్ ఆధ్వర్యంలోని బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఆస్పత్రిలో మౌలిక వసతులు, మందుల నిలువలు, శుభ్రత, శానిటేషన్, ప్లాంటేషన్, పరిసరాల పరిశుభ్రతను వారు పరిశీలించారు.

February 26, 2026 / 09:23 AM IST

మాదకద్రవ్యాల రవాణాపై గట్టిగా నిఘా పెట్టాలి: కలెక్టర్

MBNR: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో విద్య పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హై స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల కార్యకలాపాలపై పర్యవేక్షణ కొనసాగించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 09:20 AM IST

పరీక్షా కేంద్రాల వద్ద ఇవి బంద్

VKB: జిల్లాలో నేడు ఇంటర్ 2nd ఇయర్ పరీక్షకు 8,006 మంది విద్యార్థులు హాజరుకానునట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి తెలిపారు. గురువారం లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు.

February 26, 2026 / 09:18 AM IST