• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కరీంనగర్ కార్పొరేషన్లో ‘డిప్యూటీ’ ఛాంబర్ చిచ్చు

కరీంనగర్ నగర పాలక సంస్థలో ఎన్నికలు ముగిసిన ప్రతిసారీ డిప్యూటీ మేయర్ ఛాంబర్ కేటాయింపు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. 2005లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుండటం గమనార్హం. గతంలో డిప్యూటీగా పనిచేసిన తాజా మాజీ మేయర్ సునీల్ రావుకు ఛాంబర్ కేటాయించవద్దనే డిమాండ్ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.

February 22, 2026 / 06:49 PM IST

‘మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం’

MDCL: మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అదివారం బోయినపల్లిలోని తన కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సౌకర్యాలు, విద్యుత్ లైన్ల మార్పు, శ్మశానవాటిక పరిరక్షణ వంటి సమస్యలను ప్రస్తావించారు.

February 22, 2026 / 06:47 PM IST

దేవతామూర్తుల ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా

SDPT: మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో శ్రీ శంభు-రామ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జనగామ MLA డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:46 PM IST

‘ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి.. అబుల్ కలాం ఆజాద్’

MDK: హిందూ ముస్లింల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేసిన మహోన్నత వ్యక్తి, విద్యావేత్త మౌలాన అబుల్ కలాం ఆజాద్ అని మున్సిపల్ ఛైర్మన్ కానుగు రాధిక పేర్కొన్నారు. ఆదివారం విద్యావేత్త, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని  మెదక్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు.

February 22, 2026 / 06:45 PM IST

విద్యార్థుల సృజనాత్మకత కోసమే టాలెంట్ టెస్ట్

BHNG: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి, వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు తెలిపారు. ఆదివారం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలను రాయాలని రాజు సూచించారు.

February 22, 2026 / 06:43 PM IST

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

NZB: కమ్మర్‌పల్లి మండలంలోని కేసీఆర్ కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రోళ్ల లస్మయ్య (75) మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లస్మయ్య ఎకైల్పై కమ్మర్ పల్లి నుంచి వెళ్తుండగా జాతీయ రహదారి-63పై అతని వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లస్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఎస్సై అనిల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 06:40 PM IST

‘రేపటి నుంచి యధావిధిగా ప్రజావాణి’

JGL: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి తిరిగి యథాతథంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 06:37 PM IST

నూతన ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్‌లకు సన్మానం

NLG: చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, సీపీఎం జిల్లా నేత అవిశెట్టి శంకరయ్య వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సుధాకర్ రెడ్డి, రాజయ్య, యాదయ్య, అర్జున్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:35 PM IST

‘మెరుగైన ఫలితాల లక్ష్యంగా ప్రత్యేక తరగతులు’

ASF: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. జిల్లా గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా మెరుగైన ఫలితాల లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు DIEO రాందాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పూర్తి సన్నద్ధతతో పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:33 PM IST

రేపటి రైతు సభకు కవిత రాక

గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్లో సోమవారం ‘రైతు సంఘర్షణ సభ’ జరగనుంది. ఈ సభకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలపై చర్చించనున్నారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ కోరారు.

February 22, 2026 / 06:33 PM IST

ఎల్లమ్మ ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు

SRCL: కోనరావుపేట (M) బావుసాయిపేట గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ భద్రత కోసం ఆదివారం ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గౌడ కుల పెద్దల సమక్షంలో వీటిని ప్రారంభించి, ఆలయానికి అప్పగించారు. భక్తుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు ఆలయ పరిసరాలను సురక్షితంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశమని నవీన్ తెలిపారు.

February 22, 2026 / 06:33 PM IST

ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఇమ్రాన్ అలీ

కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా మీర్ ఇమ్రాన్ అలీ, ఉపాధ్యక్షుడిగా వెంక గౌడ్, జనరల్ సెక్రటరీగా కోశాధికారిగా వెంకట్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా షామయ్య, బలరాంలను ఎంపిక చేశారు.

February 22, 2026 / 06:32 PM IST

వీధి కుక్కల దాడిలో పలు పశువులు మృతి

ADB: బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామంలో వీధి కుక్కల బీభత్సంతో పలు పశువుల మృత్యు బారిన పడుతున్నాయి. ఆదివారం గ్రామంలోని లస్మన్నకు చెందిన ఆవు దూడపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అంతకు ముందు పలు మేకలు కుక్కల బారిన పడ్డాయి.

February 22, 2026 / 06:32 PM IST

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందజేత

SRD: ప్రతి ఒక్కరికి దైవచింతన ఉండాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ తాబేలు గుట్టలో నూతన శ్రీ జీవన జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గుమ్మడిదల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి రూ.1,51,000 విరాళం అందజేశారు. దైవానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు.

February 22, 2026 / 06:32 PM IST

ధర్మారంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

PDPL: అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో మానేసిన వారికి ఆదివారం ధర్మారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ బేస్ లైన్ పరీక్షలు నిర్వహించినట్లు కోఆర్డినేటర్ వడ్లూరి కిరణ్ తెలిపారు. చివరి పరీక్షలు ఏప్రిల్లో పెద్దపల్లిలో నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. అందుకోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 06:31 PM IST