హనుమకొండ జిల్లా స్థాయి ఛీఫ్ మినిస్టర్స్ కప్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బహుమతులను అందించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
BHNG: మోత్కూరు మున్సిపాలిటీని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం మోత్కూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్పర్సన్ మరియు వైస్ ఛైర్మన్లు పదవి బాధ్యతల స్వీకరణ తదుపరి మొదటి సాధారణ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు.
BDK: చర్ల సత్యనారాయణపురం గ్రామం సర్పంచ్ గౌతమి ప్రభుత్వ మీసేవలో విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిచి ప్రభుత్వ మీసేవ దగ్గర విధులు నిర్వహిస్తున్నారని ఇది పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ ఇవాళ స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని ఎండీవోకు వినతిపత్రం అందజేశారు.
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీని సుందరీకరణకు కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని 46, 47వ వార్డుల్లో రూ.50 లక్షలతో నాలా కల్వర్టు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్పర్సన్ నివేదితతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. వారం రోజుల్లో సీఎంని కలిసి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
HYD: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇవి జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరవుతుండగా, 1,495 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 28,500 మంది ఇన్విజిలేటర్లు నియమించారు.
VKB: దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన తుప్పలి వెంకటమ్మకి సీఎం సహాయనిధి కింద రూ. 60,000 మంజూరైంది. ఈ చెక్కును గ్రామ సర్పంచ్ సుజాత బసప్ప, ఉప సర్పంచ్ జె.దస్తయ్య అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించారని సర్పంచ్ తెలిపారు.
KMR: జిల్లా కేంద్రంలోని సీఐటీయూ నాయకులను ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్స్టేషన్కు తరలించారు. ఆశ వర్కర్ల సమస్యలపై సీఐటీయూ ‘ఛలో హైదరాబాద్’కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో సోమవారం సీఐటీయూ నాయకుడు జె.రవీందర్ను హౌస్ అరెస్ట్ చేశారు.
NZB: వేల్పూర్ మండలం అంక్సాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం ప్రారంభమైంది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి ఉపాధ్యాయులకు అకాడమిక్ విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ కాంప్లెక్స్ సమావేశంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
NLG: నకిరేకల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంతు సేవాలాల్ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా సమాజానికి సేవాలాల్ చేసిన సేవలను కొనియాడారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ చెవిగోని రజిత, ఇతర నాయకులు పాల్గొన్నారు.
MBNR: హన్వాడ మండలం బుద్ధారం గ్రామంలో వ్యవసాయ అధికారి (ఏవో) కిరణ్ కుమార్ వరి పంటను పరిశీలించారు. నెల రోజుల క్రితం సాగు చేసిన పంట ఎదగలేదని, నాట్లు స్థిరంగా ఉన్నాయని గుర్తించారు. రైతులకు పంటలు కోలుకోవడానికి 19.19.19 ఎరువులు, జింక్ వినియోగం, నీటిని సరిగా అందించడం, తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని వివరించారు.
KNR: ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆశా కార్యకర్తలు చేపట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేశవపట్నం నుంచి తరలివెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పీ. విజయలక్ష్మీ, ప్రధాన కార్య దర్శి లీలాదేవి ఉన్నారు.
SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ తొలి మున్సిపల్ పాలకవర్గం సమావేశాన్నీ సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులు నిర్ణయించారు. మున్సిపల్ పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో MLA గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. .
JN: పాలకుర్తి మండలం దుబ్బా తండాగ్రామానికి చెందిన భూక్య వెన్నలాకు సంచార చేపల విక్రయ వాహనాన్ని సోమవారం అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ మహిళలకు ఆర్థిక బలం అందిస్తున్నాయని, మహిళలు వాటి ద్వారా కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించగలరని తెలిపారు.
NLG: విద్యార్థుల ఉల్లాసం కోసం ఏపూర్ 1వ వార్డు సభ్యులు వెంకటేశం తమ ఉదారతను చాటుకున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఆయన ఆట వస్తువులను సమకూర్చారు. వీటిని సర్పంచ్ పాలెం మహేష్ చేతుల మీదుగా సోమవారం విద్యార్థులకు అందజేశారు. పాఠశాల సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు హెచ్ఎం అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
BHPL: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ వద్ద SSA ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులకు సోమవారం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరంలో BHPL జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.