• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

త్వరలో సహాయ ఉపకరణాలు పంపిణీ

MNCL: దివ్యాంగులకు త్వరలో సహాయ ఉపకారణాలను పంపిణీ చేయనున్నామని వైద్య అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు లక్షెట్టిపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ రైతు వేదికలో దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకారణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. వారి సదరం సర్టిఫికెట్లను వైద్యులు పరిశీలించారు.

February 20, 2025 / 11:12 AM IST

కురవి ఆలయంలో హీరో గోపీచంద్ పూజలు

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయాన్ని ప్రముఖ సిని హీరో గోపిచంద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గోపిచంద్‌కు ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, దర్మకర్త చిన్నం గణేష్‌లు అందజేశారు. కాగా, ఆయన అభిమానులు, స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు.

February 20, 2025 / 11:06 AM IST

అధికారులు తిట్టారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MNCL: అటవీ అధికారులు తిట్టారని జన్నారం మండలంలోని గడంగూడాకు చెందిన తుకారాం ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గడంగూడాలో స్థానికులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. గురువారం అటవీ అధికారులు వచ్చి వెళ్లిపోవాలని దుర్భాషలాడారన్నారు. తుకారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జన్నారం అటవీ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆస్పత్రికి తరలించారు.

February 20, 2025 / 10:34 AM IST

వక్ఫ్ బోర్డు సీఈఓకు ఫిర్యాదు

WGL: రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓని పర్వతగిరి మండలానికి చెందిన పలువురు ఈరోజు కలిసి ఫిర్యాదు చేశారు. అన్నారం దర్గా వద్ద తలనీలాలను రెండేళ్లుగా టెండర్ వేయకుండా వెంట్రుకలు పోగుచేసి అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దొంగతనంగా తలనీలాలు అమ్ముకొని, వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు.

February 20, 2025 / 08:18 AM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముంజాల స్వామి (48) రోజు వారీగా గీత కార్మిక వృత్తిలో భాగంగా బుధవారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

February 20, 2025 / 07:55 AM IST

21ఏళ్లుగా ఊపిరితిత్తుల్లో ఉండిపోయిన ప్లాస్టిక్ పెన్ క్యాప్: తొలగించిన వైద్యులు

KNR: కిమ్స్ హాస్పిటల్ వైద్యులు 21 ఏళ్లుగా ఊపిరితిత్తులలో ఉండిపోయిన ప్లాస్టిక్ పెన్ క్యాప్ విజయవంతంగా తొలగించారు. కరీంనగర్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు 5 ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి ఏ ఇబ్బంది లేదన్నారు. 10 రోజులుగా అతను అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు CT స్కాన్ చేసి హెలిక్యాప్ గుర్తించి వెలికి తీశారు.

February 20, 2025 / 07:18 AM IST

వేసవులు తాగునీటి సమస్యలు లేకుండా చూసుకోవాలి

NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు, గ్రామీణ ప్రాంతంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోను ఆదేశించారు. బుధవారం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో తాగునీటి సరఫరాపై ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారిగా అడిగి తెలుసుకున్నారు.

February 19, 2025 / 08:00 PM IST

అభ్యంతరాల స్వీకరణ గడువు పొడగింపు: కలెక్టర్

NRML: వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి చేపట్టిన నియామకాల దరఖాస్తులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 24వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా వైద్య కళాశాలలో పొరుగు సేవల పద్ధతిన 32 ఖాళీల భర్తీ నియామక ప్రక్రియలో భాగంగా, అర్హులైన అభ్యర్థులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 20వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.

February 19, 2025 / 07:44 PM IST

విద్యుత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: జమ్మిగడ్డ ఎస్ఈ విద్యుత్ సర్కిల్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేశారు. జిల్లాలో ప్రతిరోజు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు. ఎంత లోడ్ వాడుతున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వచ్చే వేసవి దృష్ట్యా వ్యవసాయ రంగానికి, గృహ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

February 19, 2025 / 07:28 PM IST

ప్రయాణికులకు మెరుగైన ఫీవర్ అందించాలి: ఆర్ ఎం

NRML: ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ఆర్ఎం సొలోమోన్ అన్నారు. నిర్మల్ బస్ డిపోలో నిర్వహిస్తున్న శిక్షణ ఇవాళ నాటికి రెండో రోజుకు చేరుకుంది. సమిష్టిగా కృషి చేస్తూ సంస్థ మనుగడకు పాటుపడాలని అన్నారు. అనంతరం ఉద్యోగులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, రాజశేఖర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

February 19, 2025 / 07:16 PM IST

‘అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు’

NRML: అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. అంగన్వాడీల అభివృద్ధి, ఉన్నతీకరణ తదితర అంశాలపై బుధవారం సంక్షేమ శాఖ జేడి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అంగన్వాడీలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

February 19, 2025 / 07:14 PM IST

‘బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి’

NRML: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఇవాళ జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించు వివిధ రుణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు అందించు రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదన్నారు.

February 19, 2025 / 07:03 PM IST

నరేందర్ రెడ్డిని గెలిపించాలి: ఆడే గజేందర్

ADB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని బోథ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆడే గజేందర్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.

February 19, 2025 / 06:56 PM IST

కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వర్షిత

NLG: పెద్దవూర మండలం వెల్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆడెపు వర్షిత, ఈనెల 9న నాగార్జునసాగర్ బీసీ గురుకులంలో జరిగిన సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కయ్యారు. ఈనెల 20 నుంచి 23 వరకు వికారాబాద్ జరుగు పోటీలలో జిల్లా తరపున పాల్గొననున్నట్లు ఇవాళ పాఠశాల PD లెనిన్ తెలిపారు.

February 19, 2025 / 06:55 PM IST

ఉద్యాన నర్సరీ సందర్శించిన విద్యార్థులు

ADB: జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఉజ్వల భారతదేశం కోసం ప్రధానమంత్రి పాఠశాలలు కార్యక్రమంలో భాగంగా అధికారులు విద్యార్థుల కోసం క్షేత్ర పర్యటనలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఇవాళ గుడిహత్నూర్ ప్రభుత్వ మోడల్ స్కూల్, ఉన్నత పాఠశాల, యాపాల్ గూడ విద్యార్థులు ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన నర్సరీని సందర్శించారు.

February 19, 2025 / 06:50 PM IST