• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహబూబ్‌నగర్‌లో ముమ్మర తనిఖీలు

MBNR: మహబూబ్‌నగర్ 2-టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాహనదారులు పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. వాహన పత్రాలు (ఆర్‌సీ) తమ వెంటే ఉంచాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

March 28, 2026 / 04:05 PM IST

సీసీ రోడ్ల మంజూరులో జాప్యం చేస్తున్న ప్రభుత్వం.

SDPT: బిఆర్ఎస్ సర్పంచులపై స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ వివక్ష చూపుతున్నారని అక్కన్నపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భూక్య కృష్ణ నాయక్ ఆరోపించారు.బిఅర్ఎస్ మద్దతుతో గెలిస్తే మాపై ఎందుకింత వివక్ష చూపుతున్నారో తెలియదని,గ్రామాల అభివృద్ధికి అధికారులు సైతం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

March 28, 2026 / 04:03 PM IST

సీసీ రోడ్ల పనులను పర్యవేక్షించిన ఛైర్ పర్సన్

NLG: దేవరకొండ మున్సిపాలిటీలోని 20వ వార్డులో సీసీ రోడ్ల పనులు గత రెండు రోజులుగా వేగంగా సాగుతున్నాయి. శనివారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు పనులను పర్యవేక్షించారు. ఆమె మాట్లాడుతూ.. వార్డులోని ఐబీ వెనక స్వర్ణకార్ వీధి లోపల ఇరువైపులా రోడ్లు నిర్మించబడుతున్నట్లు చెప్పారు. నాణ్యతతో పనులను త్వరగా పూర్తి చేయనున్నారు.

March 28, 2026 / 04:01 PM IST

లోక్ అదాలత్‌లో కేసుల శాశ్వత పరిష్కారం: జడ్జీ

NZB: పరస్పర రాజీతో కోర్టు కేసులకు శాశ్వత పరిష్కారం సాధించవచ్చని మొదటి అదనపు జిల్లా జడ్జి హర్ష తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీ దుర్గా ప్రసాద్, బార్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

March 28, 2026 / 04:01 PM IST

గాలికుంటు వ్యాధి నివారణకు మందులు పంపిణీ

NGKL: మూగజీవాలకు వస్తున్న గాలికుంటు వ్యాధుల నివారణకు మందులు పంపిణీ చేస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ నాగార్జున తెలిపారు. కల్వకుర్తి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో శనివారం మూగజీవాలకు గాలికుంటు వ్యాధి టీకాలను ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూగ జీవికి గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని సూచించారు.

March 28, 2026 / 04:00 PM IST

కోహెడలో చలివేంద్రం ప్రారంభం..!

SDPT: కోహెడ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి JSR ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత చల్లటి త్రాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ మేరకు గ్రామ ఉపసర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. బాటసారులకు ప్రయాణికులకు ఈ చలివేంద్ర కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

March 28, 2026 / 03:59 PM IST

గణిత పరీక్షకు 99.9 శాతం హాజరు

PDPL: జిల్లాలో పదో తరగతి గణితం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జీ.శారద తెలిపారు. మొత్తం 7,495 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,486 మంది పరీక్ష రాయగా, 9 మంది గైర్హాజరయ్యారు. 99.9 శాతం హాజరు నమోదవడం గమనార్హమని పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.

March 28, 2026 / 03:54 PM IST

‘ఆశా వర్కర్లను అక్రమ అరెస్టులు చేయడం అన్యాయం’

SRCL: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మండిపడ్డారు. ఈరోజు ‘ఛలో హైదరాబాద్’ ఇందిరాపార్క్ మహాధర్నాను భగ్నం చేయాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

March 28, 2026 / 03:50 PM IST

సిరికొండలో పర్యటించిన ఆడే గజేందర్

ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ శనివారం పర్యటించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోడసం భూపతి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న గజేందర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 28, 2026 / 03:44 PM IST

‘ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ విజయవంతం చేయాలి’

MNCL: ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మంచిర్యాలలో లెర్నింగ్ స్టడీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు రెండో రోజు శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. సర్వేకు జిల్లాలో నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

March 28, 2026 / 03:42 PM IST

పరీక్షలపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

GDWL: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం గద్వాలలోని విశ్వేశ్వరయ్య, విశ్వభారతి పాఠశాలల కేంద్రాలను తనిఖీ చేశారు. వైద్య శిబిరాలు, మౌలిక వసతులు ఉండేలా చూడాలని సూచించారు. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్‌తో తరలించి, జవాబుపత్రాలను తపాలా కార్యాలయంలో భద్రపరచాలని తెలిపారు.

March 28, 2026 / 03:41 PM IST

రాజీ మార్గమే రాజమార్గం:DCP

HNK: రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం సత్వర పరిష్కారం జరుగుతుందని సెంట్రల్ జోన్ DCP దార కవిత అన్నారు. ఇవాళ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ పడదగిన కేసులో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.

March 28, 2026 / 03:37 PM IST

అంబట్పల్లిలో మెగా హెల్త్ క్యాంప్

NGKL: అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గైనకాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వివిధ విభాగాల నిపుణులు రోగులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ జే.సీ.పీ. యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ లక్ష్మమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 28, 2026 / 03:35 PM IST

అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీల పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే.అశ్విని మహేశ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.

March 28, 2026 / 03:35 PM IST

జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

KMR: జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా న్యాయమూర్తి డా. CH.VVR. వరప్రసాద్, ఎస్పీ యం. రాజేష్ చంద్ర ప్రారంభించారు. పెండింగ్ కేసులను కక్షిదారులు పరస్పర సమ్మతితో, సామరస్యపూర్వకంగా త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని, రాజీ మార్గమే ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.

March 28, 2026 / 03:30 PM IST