NRML: వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి చేపట్టిన నియామకాల దరఖాస్తులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 24వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా వైద్య కళాశాలలో పొరుగు సేవల పద్ధతిన 32 ఖాళీల భర్తీ నియామక ప్రక్రియలో భాగంగా, అర్హులైన అభ్యర్థులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 20వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.
SRPT: జమ్మిగడ్డ ఎస్ఈ విద్యుత్ సర్కిల్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేశారు. జిల్లాలో ప్రతిరోజు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు. ఎంత లోడ్ వాడుతున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వచ్చే వేసవి దృష్ట్యా వ్యవసాయ రంగానికి, గృహ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
NRML: ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ఆర్ఎం సొలోమోన్ అన్నారు. నిర్మల్ బస్ డిపోలో నిర్వహిస్తున్న శిక్షణ ఇవాళ నాటికి రెండో రోజుకు చేరుకుంది. సమిష్టిగా కృషి చేస్తూ సంస్థ మనుగడకు పాటుపడాలని అన్నారు. అనంతరం ఉద్యోగులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, రాజశేఖర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
NRML: అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. అంగన్వాడీల అభివృద్ధి, ఉన్నతీకరణ తదితర అంశాలపై బుధవారం సంక్షేమ శాఖ జేడి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అంగన్వాడీలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
NRML: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఇవాళ జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించు వివిధ రుణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు అందించు రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదన్నారు.
ADB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని బోథ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆడే గజేందర్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
NLG: పెద్దవూర మండలం వెల్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆడెపు వర్షిత, ఈనెల 9న నాగార్జునసాగర్ బీసీ గురుకులంలో జరిగిన సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కయ్యారు. ఈనెల 20 నుంచి 23 వరకు వికారాబాద్ జరుగు పోటీలలో జిల్లా తరపున పాల్గొననున్నట్లు ఇవాళ పాఠశాల PD లెనిన్ తెలిపారు.
ADB: జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఉజ్వల భారతదేశం కోసం ప్రధానమంత్రి పాఠశాలలు కార్యక్రమంలో భాగంగా అధికారులు విద్యార్థుల కోసం క్షేత్ర పర్యటనలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఇవాళ గుడిహత్నూర్ ప్రభుత్వ మోడల్ స్కూల్, ఉన్నత పాఠశాల, యాపాల్ గూడ విద్యార్థులు ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన నర్సరీని సందర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అదిలాబాద్ ఎంపీ జి.నగేష్ కోరారు. ఇవాళ జన్నారం మండల కేంద్రంలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీల అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్యలను గెలిపించాలని కోరుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామనాథ్, మండల అధ్యక్షులు మధుసూదన్ ఉన్నారు.
ADB: బేల మండలంలోని కరోని (బి) గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేందుకు విద్యార్థులకు ప్లేట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి విద్యార్థులకు ప్లేట్లను ఇవాళ అందజేశారు. ప్రైమరీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
NRML: పన్ను వసూలు వంద శాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఇవాళ నిర్మల్ పట్టణంలో వివిధ కాలనీలలో జరుగుతున్న పన్నుల వసూలు, వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో పనులు చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
NRML: వికలాంగుల పెన్షన్ కొరకు తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై, సర్టిఫికెట్లు మంజూరు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ.. జిల్లాలో వందలకు పైగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొంది అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని అన్నారు.
JN: పాలకుర్తిలో బీఎస్పీ నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసెంబ్లీ అధ్యక్షుడు ఈదునూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుజన నాయకులను టార్గెట్ చేసిందని విమర్శించారు.
JN: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. ఇవాళ జనగామ మండలం యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజ మహేంద్ర నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
BHPL: ఈనెల 21, 22వ తేదీలలో ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎస్ఎఫ్ఎ నేతలు ఆవిష్కరించారు. టెన్త్ టాలెంట్ టెస్ట్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.