SRPT: జమ్మిగడ్డ ఎస్ఈ విద్యుత్ సర్కిల్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేశారు. జిల్లాలో ప్రతిరోజు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు. ఎంత లోడ్ వాడుతున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వచ్చే వేసవి దృష్ట్యా వ్యవసాయ రంగానికి, గృహ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.