పెట్టుబడుల ప్రకటన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భిన్నంగా స్పందించారు. ‘తెలంగాణలో ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. కొత్త పెట్టుబడులు రావడం జరుగుతుంటే పక్క రాష్ట్రంలో మాత్రం ఉన్న సంస్థలు మూతపడుతున్నాయి.. కొత్త సంస్థలు రావడం లేదు’ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుడ్డు చుట్టూ తిరు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు దూకుడు పెంచారనే చెప్పవచ్చు. దర్యాప్తును వేగవంతం చేస్తూ క్రమంగా పలువురిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
bandla ganesh:నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇటీవల కాంట్రవర్సీ పోస్టులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. తారకరత్న చనిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పక్క పక్కనే కూర్చొన్నారు. ఆ ఫోటోను ట్వీట్ చేసి కామెంట్ చేశారు.
school holidays in telangana:తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం చలి ఉన్నా.. ఉక్కపోత ఎక్కువే ఉంది. పిల్లలకు ఒంటి పూట బడులపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్ ఉంటుందని ప్రకటన చేశారు. ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.
హైదరాబాద్(Hyderabad) లో వేసవి తాపం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.
తారకరత్న ఆకాల మరణం ఆ కుటుంబాన్ని తట్టుకోనీయడం లేదు. తారక్ కూతురు, భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఏమి తినకపోవడంతో భార్య అలేఖ్యను ఆస్పత్రిలో చేర్చారు. ఈ రోజు ఫిల్మ్ చాంబర్లో ఉన్న తారక రత్న భౌతికకాయం వద్దకు తల్లి అన్నపూర్ణమ్మ వచ్చారు. నిర్జీవంగా ఉన్న తారక్ను చూసి వెక్కి వెక్కి ఏడ్చారు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆరోగ్య శాఖమంత్రి హరీష్రావు(Harish Rao) చెప్పారు. ఇవాళ హైదరాబాద్ (hyderabad)లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన 'ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్'లో ఆయన మాట్లాడారు.
balloon landed in farmers field:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో కూడా పెద్ద బెలూన్ కలకలం రేపింది. వ్యవసాయ పొలాల పక్కనే గల మామిడి తోటలో పడింది. దీంతో అక్కడ ఉన్న రైతులు, రైతు కూలీలు భయాందోళనకు గురయ్యారు.
ఆలయ పున:నిర్మాణం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పాలక మండలి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం వారాంతాల్లో భక్తులు భారీగా వస్తున్నారు. ఇక ఉత్సవాలకు ఆలయం కిటకిటలాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది.
నిత్యం కేసీఆర్ వార్త మహారాష్ట్రలో వినిపిస్తుండడంతో అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా ప్రాంతంలోని నాందేడ్ లో సభ నిర్వహించడంతో మరాఠా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ హాజరవడం కూడా మరాఠా ప్రజలు మరచిపోలేదు.
బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం కన్నుమూసిన నందమూరి తారకరత్న మృత దేహాన్ని నిన్న హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు. నేడు ఉదయం.. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అసదుద్దీన్. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు, రాళ్లు విసిరి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీలోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి.