రంగారెడ్డి: మహాశివరాత్రి సందర్బంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
SRD: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని మంజీరా నగర్ శ్రీ మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి యాదమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్థానిక నాయకులు ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, పట్టణ ప్రజలు, పాల్గొన్నారు.
ఆదిలాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని బాలాపూర్ గ్రామంలో శ్రీ వాసుకేశ్వర మహాదేవ ఆలయంలో వేకువ జామున శివలింగానికి పాలాభిషేకం చేశారు. అలాగే ఇవాళ సాయంత్రం యజ్ఞం, రేపు ఉదయం 9 గంటలకు గ్రామంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సాయికిరణ్ తెలిపారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని దామన్ గూడ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నెరడిగొండ ఎమ్మెల్యే నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం, త్రాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు.
మెదక్: మహా శివరాత్రి సందర్బంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గమాత దేవాలయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జాతార భద్రతను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. భద్రతపరంగా ప్రజలందరూ ధైర్యంగా ఉండాలన్నారు.
NRML: సారంగాపూర్ మండలం దని గ్రామంలోని అతి ప్రాచీన రాజరాజేశ్వరి ఆలయంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేక కార్యక్రమాలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందులో బీజేపీ సీనియర్ నాయకులు విలాస్, రాజేందర్ రెడ్డి, పోతన్న, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
NLG: నల్గొండ పట్టణంలోని పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన అభిషేకాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఆలయాలను మరింత అభివృద్ధి చేయాలని భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
MHBD: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కురవి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెనాన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. కురవి జాతరలో బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నిజామాబాద్: గోకుల్ గో సేవా సమితి ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని అంబికా సహిత నగరేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో గోపూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, సహకరించిన సభ్యులకు ఆ గోమాత ఆశీస్సులు, ఆ అంబికా సహిత నగరేశ్వరుడి ఆశీస్సులు మరియు వాసవి మాత కృపా కటాక్షాలు ఉండాలని పురోహితులు ప్రత్యేకంగా ఆశిర్వధించారు.
MNCL: శివరాత్రి పండుగ పూట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట గోదావరిలో స్నానానికి వెళ్లి పారుపల్లికి చెందిన రాజేశ్(50) నీటిలో గల్లంతయినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ములుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి, ఈనెల 28 సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం అమలు చేస్తూ కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పేర్కొన్న ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 153 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
NLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని DMHO డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. పట్టణ కార్యాలయంలోని సమావేశ మందిరంలో PHC, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రోజు PHC లకు వచ్చే రోగుల నమూనాలను సేకరించి హబ్కు పంపాలన్నారు.
NZB: కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం (60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు
NZB: బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మందిరం వద్ద మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. స్వామి వారిని వరుస క్రమంలో దర్శించుకుంటూ పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను పూజారులు వివరించారు. సాయంత్రం వరకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
SRPT: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులుదర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జడల రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలన్నారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు