• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హన్మకొండ ఆర్టీసీ డిపోలో ఫోన్-ఇన్ కార్యక్రమం

HNK: హన్మకొండ నగరంలో ఆర్టీసీ డిపోలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ధరమ్ సింగ్ తెలిపారు. డిపో పరిధిలోని జమ్మికుంట, వేలేరు, సంగెం, హసన్ పర్తి, కమలాపూర్ తదితర ప్రాంతాల ప్రజలు డిపో అభివృద్ధి, బస్సు సర్వీసులపై తమ అభిప్రాయాలను 8977781103 నంబర్‌కు తెలియజేయాలని ఆయన కోరారు.

March 28, 2026 / 06:08 AM IST

దొంగతనం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్: CI నాగరాజు

ADB: దొంగతనం కేసులో పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ నాగరాజు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఫయాజ్ వద్ద నుంచి రెండు వెండి పట్టిలను, పలు రోల్డ్ గోల్డ్ ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. 2 రోజుల్లో దొంగతనం కేసును చేదించి ఇద్దరు దొంగలను పట్టుకోవడంతో SP అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.

March 28, 2026 / 06:08 AM IST

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం ప్రధాన కాలువ ద్వారా 5వ విడతలో భాగంగా 1200 క్యూసెక్కుల నీటిని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. కాలువల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశుపాలకులు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి, కాలువ ఒడ్డుల సమీపానికి వెళ్లవద్దని నిజాంసాగర్ నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు.

March 28, 2026 / 06:08 AM IST

పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురి అరెస్ట్

వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులోని ఓ మిల్లు వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.5,350 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 28, 2026 / 06:06 AM IST

పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురి అరెస్ట్

వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులోని ఓ మిల్లు వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.5,350 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 28, 2026 / 06:06 AM IST

48 గంటల్లోనే దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్

ADB: జిల్లాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి వాడలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఇన్స్‌స్పెక్టర్ కె. నాగరాజు ఆధ్వర్యంలో నిందితులు షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఫయాజ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి వెండి పట్టీలు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలను 100% రికవరీ చేశారు.

March 28, 2026 / 06:06 AM IST

జిల్లాలో HPV వ్యాక్సినేషన్ సెంటర్లు ఇవే..!

RR: జిల్లా పరిధిలో అనేక చోట్ల HPV వాక్సినేషన్ ప్రారంభించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు బాలికలకు అందిస్తున్నారు. రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొండాపూర్ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ప్రాంతాల్లో వీటిని అందిస్తున్నారు. తల్లిదండ్రులతో ప్రతి ఒక్కరు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు.

March 28, 2026 / 06:04 AM IST

ముదిగొండ తహసీల్దార్ సునీత కలెక్టరేట్‌కు బదిలీ

KMM: ముదిగొండ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సునీత ఎలిజిబెత్ ఖమ్మం కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో గతంలో కూసుమంచి తహసీల్దార్‌గా పనిచేసిన రవి ముదిగొండ కొత్త తహసీల్దార్‌గా నియమితులయ్యారు. రెవెన్యూ విభాగంలో జరిగిన ఈ మార్పులతో త్వరలోనే వారు తమ బాధ్యతలను స్వీకరించనున్నారు.

March 28, 2026 / 06:03 AM IST

నగరంలో దంచికొట్టిన వర్షం.. రికార్డు వివరాలు ఇవే..!

HYD: నగరంలో నిన్న రాత్రి వర్షం దంచికొట్టింది. పాత GHMC పరిధి అల్వాల్ అంబేద్కర్ నగర్‌లో అత్యధికంగా 14.0 మి.మీ వర్షం కురిసింది. కాప్రా, కుషాయిగూడలో 13.8 మి.మీ, వెస్ట్ మారేడ్‌పల్లిలో 13.0 మి.మీ వర్షం పడింది. నేరెడ్‌మెట్, ఆనంద్ బాగ్, మౌలాలి, సఫిల్‌గూడ ప్రాంతాల్లో 12 మి.మీకి పైగా వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. వేసవి వేళ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

March 28, 2026 / 06:02 AM IST

కనులపండువగా రామయ్య పల్లకి సేవ

NZB: సిరికొండ మండలం చిన్న వాల్గోట్ గ్రామంలో సీతారామచంద్రస్వామి పల్లకి సేవ భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించిన పల్లకిలో అధిష్టింపజేసి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగుడుగునా మంగళ హారతులు పట్టి స్వామివారికి నీరాజనాలు అర్పించారు. భజనలు, రామనామ స్మరణలతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

March 28, 2026 / 06:01 AM IST

పేకాట రాయుళ్ల అరెస్టు

NLG: ఇంట్లో పేకాట ఆడుతున్న జూదరులను మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ కాలనీలో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.9,213 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

March 28, 2026 / 06:01 AM IST

గౌసాబాధ్ తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

SRD: మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ తండాలో లబ్ధిదారుడు ఖీరు పవార్ నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం శుక్రవారం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ మాక్స్ రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. పేదల ఇళ్ల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సొంతింటి కల నెరవేరినందుకు లబ్ధిదారుడు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

March 28, 2026 / 05:37 AM IST

మెదక్లో 134 సిలిండర్లను సీజ్: కలెక్టర్

MDK: మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ గ్యాస్, ఇంధనం సరఫరాపై భరోసా ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ వినియోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టి 134 సిలిండర్లను సీజ్ చేశామని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మెదక్ జిల్లాలో ఎటువంటి గ్యాస్, ఇంధనం కొరత లేదని, అవసరానికి మించి నిల్వ చేసుకుని ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

March 28, 2026 / 05:30 AM IST

ఉప్పల్ క్యాంప్.. ఎస్సీ కాలనీలో చీకటి రాజ్యం

GDWL: అయిజ మండలం ఉప్పల్ క్యాంప్ ఎస్సీ కాలనీలో రెండు రోజులుగా వీధి దీపాలు వెలగక ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయం వేస్తోందని, అధికారులు వెంటనే స్పందించి దీపాలు వేయించాలని కోరుతున్నారు.

March 28, 2026 / 05:20 AM IST

‘గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి’

NRPT: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. అంతకుముందు తిరుమలనాథ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రూ. 10 లక్షల వ్యయంతో హాల్ నిర్మించినట్లు చెప్పారు.

March 28, 2026 / 05:17 AM IST